మిర్యాలగూడ జనవరి 8 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని రాఘవ టాకీస్ నుంచి చర్చి రోడ్డు సుష్మ హాస్పిటల్ ఆంజనేయస్వామి గుడి శివాలయం మీదుగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లే రోడ్డు పై నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు నడుస్తుంటాయి. ప్రధాన రహదారి కావడంతోపాటు ఈ రహదారి ద్వారానే పాఠశాలలు, కళాశాలలు, పలు ఆసుపత్రులకు వెళ్లే దారి కావడం రద్దీ విపరీతంగా ఉంటుంది. సుష్మ హాస్పిటల్, ఆంజనేయ స్వామి గుడి సమీపంలో కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బంది తో పాటు స్వల్ప ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న మిర్యాలగూడ పట్టణ 36వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తన పరిధిలోని కాలనీలలో వాహనాల రాకపోకలు సునాయాసంగా కొనసాగించేందుకు, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించే విధంగా బుధవారం సొంతంగా అబ్దుల్లా ముందుకు వచ్చి రెండు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ పాఠశాల కళాశాలలకు ఆసుపత్రులకు ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనాలు ఈ రోడ్డుపై నడుస్తున్నాయని, పాఠశాల వెళ్లే చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా పాదాచారులు సౌకర్యంగా నడిచి వెళ్లేందుకు గాను స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. 36 వార్డు పరిధిలో మరికొన్ని స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు త్వరలోనే పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.స్పీడ్ బ్రేకర్ల పనులు చేపట్టడంతో అబ్దుల్లాకు స్థానికులు అభినందించారు.

