Home తాజా వార్తలు సైబర్ నేరాలపై  విద్యార్థులకు

సైబర్ నేరాలపై  విద్యార్థులకు

by Telangana Express

అవగాహన కల్పించిన పోలీసులు**లోకేశ్వరం మార్చ్ 12(తెలంగాణ ఎక్స్ ప్రెస్)లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు ఏఎస్ఐ దిగంబర్ పోలీస్ సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ దిగంబర్ మాట్లాడుతూబ్యాంకు లావాదేవీలపై గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే తమకు సంబంధించిన ఆధార్ నంబర్లు గాని, ఏటీఎం నెంబర్ల సమాచారం ఇవ్వకూడదని ఇలాంటివి ఎన్నో మోసాలు చేసే గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారని తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు అలాగే విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలియజేశారు అలాగే గ్రామంలోని యువకులకు పెద్దలకు తెలియజేస్తూ వాహనదారులు సరైన పత్రాలు వెంబట ఉంచుకోవాలని మద్యం తాగి వాహనాలు నడప రాదని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదరి త్రిబుల్ రైడింగ్ చేయరాదరి ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించనిచో చర్యలు తప్పవని తెలియజేశారు అలాగే గుర్తుతెలియని వ్యక్తులు గాని ఎవరికైనా అనుమానం ఉన్న 100 డయల్ కు ఫోన్ చేయాలని సమాచారం ఇవ్వాలని తెలియజేశారు

You may also like

Leave a Comment