Home తాజా వార్తలు యదేచ్చగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని సంబంధిత అధికారులు

యదేచ్చగా మొరం తవ్వకాలు.. పట్టించుకోని సంబంధిత అధికారులు

by Telangana Express
  • రెవెన్యూ ,అటవీ అధికారుల పర్యవేక్షణ కరువు..
    *మాయమైపోతున్న ప్రకృతి వనాలు.. ట్రిప్పర్ల సాయంతో వందల కొద్ది మొరం తరలింపు
    పెద్ద కోడప్గల్ ఆగస్టు 25( తెలంగాణ ఎక్స్ ప్రెస్):- మండల కేంద్రంలో అంజనీ గ్రామ శివారులో గల జాతీయ రహదారి పక్కనే ఉన్న అటవీ భూములలో అనుమతులు లేకుండా అక్రమ మొరం తవ్వకాలు దర్జాగా కొనసాగిస్తున్నారు. పుడమి తల్లి గుండెల పై ఆధునిక యంత్రాలతో అక్రమార్కులు చిల్లులు వేసి ప్రకృతి వనాలను చల్ల చదరం చేస్తున్నారు. మొరం దందా యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొందరు సహజ సంపదలను కొల్లగొట్టి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు సాగిస్తుండడంతో లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. కొందరు అక్రమార్కులు అక్రమంగా 10 నుంచి 20 మీటర్ల లోతు మొరం పందికొక్కుల తోడిస్తున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ కరువలన ఈ మొరం తవ్వకాల దండ ఇది చంగా కొనసాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు మామూళ్ల వసూల్లో మునిగి కన్నెత్తి కూడా చూడడం లేదని, అక్రమ దందా వ్యాపారంగా మారింది. మొరం తవ్వడానికి ఏలాంటి అనుమతులు లేకుండా ఇంత దారుణానికి ఒడిగడుతున్న సంబంధిత అధికారుల చోద్యం చూస్తున్నారు. రావలసినదనం అక్రమార్కుల జేబులోంచి వెళుతుంది. అధికారులు నాయకుల అండదండాలు ఉన్నాయని అంటూ ప్రభుత్వ ప్రైవేటు భూములు చెరువులు మొత్తం తవ్వేస్తున్నారు కొందరు అక్రమార్కులు అనుమతులు ఉన్నాయి అంటూనే నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో సెలవు దినాల్లో జెసిపిలతో తవ్వుతూ డాక్టర్ల ద్వారా పర్ల సహాయంతో గ్రామాల్లో కూడా తల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, మైనింగ్, అటవీ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం అధికారులపై స్థానికులు వాపోతున్నారు.
    ప్రభుత్వ ఆదాయానికి గండి………….. గ్రానైట్ కంకర క్వారీల మాదిరిగానే మొరం తవ్వకాలకు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అవి పర్యావరణం దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ బుగర్భ జలాలు నీటిపారుదల శాఖ వ్యవసాయ తదితర శాఖల వారు అనుమతిస్తారు. ఒక్కో క్యూబిక్ మీటర్ మట్టికి ₹30 రూపాయలు చెల్లించాలి అడవి ప్రాంతంలో చెట్లను నరికివేస్తే కేసులు పెట్టి అటు విశాఖ జరిమానా విధించాలి. ప్రభుత్వ భూములకైన పట్టా భూములకైన నిబంధనలకు లోబడి అనుమతులు పొందాలి పలుచోట్ల మొరం తవ్వకాలకు అనుమతులు లేకుండానే తమ కాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో ఎక్కడా తవ్వకాలు చేసిన క సంబంధించిన అధికారుల నుంచి వారు సూచించిన ప్రకారము అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇవేమీ లేకుండానే కొందరు అక్రమంగా ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని సంబంధిత అధికారులు తక్షణమే పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలుపుతున్నారు.

You may also like

Leave a Comment