జుక్కల్ జులై 26:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో హంగర్గా గ్రామంలో బుధవారం గొర్రెలు,మేకల పెంపకందారులకు సబ్సిడీ గొర్రెలు, మేకలను పంపిణీ చేశారు. మద్నుర్ ఏడీ వెంకటేష్ చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాట్లాడుతూ కుర్మయాదవులు ఆర్థికంగా ఎదగడానికి కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. హంగర్గా గ్రామంలో ఆరు యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి హనుమంత్, పశువైద్యాధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు
హంగర్గా గ్రామంలో సబ్సిడీ గొర్రెలు మేకలు పంపిణీ
25
previous post