
విద్యార్థులకు చేయూతనందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, కల్పన
మిర్యాలగూడ డిసెంబర్ 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
త్రిపురారం మండలంలోని నడిమి తండా లక్పతి తండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం “బిలీవ్ మీ డోనర్స్ క్లబ్”మధ్యాహ్న భోజన సమయంలో ఫ్రూట్స్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కల్పన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి విద్యార్థులకు చేయూతనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు పద్మ, అంగన్వాడీ టీచర్ విజయ, సోటి తదితరులు పాల్గొన్నారు.