Home తాజా వార్తలు అంగవైకల్యం శరీరానికే గాని మనసుకు కాదు…దివ్యంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి….- ఎల్లారెడ్డి ఎంపీడీఓ అతి నారపు ప్రకాష్

అంగవైకల్యం శరీరానికే గాని మనసుకు కాదు…దివ్యంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి….- ఎల్లారెడ్డి ఎంపీడీఓ అతి నారపు ప్రకాష్

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 5,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

అంగవైకల్యం శరీరానికే గాను మనసుకు కాదని, ఎల్లారెడ్డి ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ అన్నారు. గురువారం స్థానిక భవిత కేంద్రంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన ఎంపీడీఓ మాట్లాడుతూ వికలాంగత్వం శరీరానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కాదు అని తెలిపారు. వారిని బాగా చదివిస్తే ఉన్నత స్థాయిలో ఉంటారని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన దివ్యంగా ప్రముఖులు లూయిస్ బ్రెయిలీ, స్టీఫెన్ హాకింగ్, హెలెన్ కెల్లర్ లాంటివారు ఎన్నో అద్భుతాలు సృష్టించారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మీ పిల్లలు బాగా చదివినట్లయితే మంచి స్థానంలో ఉంటారు, వారి బాధ్యతను మీరు తీర్చవలసిన అవసరం ఉంది. నా కొడుకు వికలాంగుడు అని మీరు బాధపడవద్దు వారికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉచిత సేవలను వినియోగించు కోవాలని కోరారు. ఆతర్వాత ఐఈఆర్పి వెంకటేశం మాట్లాడుతూ సమగ్ర శిక్ష సహిత విద్యలో కల్పిస్తున్న టువంటి రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్, ఉచిత ఫిజియోథెరపీ, ఉచిత ఉపకరణాలు వంటి సేవలను దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. పిదప ఫీజియోథెరపీ వైద్యులు అరుణ్ మాట్లాడుతూ మండలంలోని దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకు ఉచిత ఫిజియోథెరపీ సేవలను వినియోగించుకోవడం ద్వారా అంగవైకల్యంలో మార్పు సాధించవచ్చని తెలియజేశారు. దివ్యంగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యంగా చిన్నారులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఐఎస్ఓ అశోక్ , కంప్యూటర్ ఆపరేటర్ కాశిరాం , సీజీవి పద్మ , దివ్యాంగుల పిల్లల వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment