Home తాజా వార్తలు భక్తులతో కీటకటలాడిన ధర్మపురి …

భక్తులతో కీటకటలాడిన ధర్మపురి …

by Telangana Express

ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ అడ్లూరి…

పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంపీ గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ జనవరి 10

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ఎంపీ వంశి,రామగుండం ఎమ్మెల్యే మాక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి నిర్వహించిన పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు,అనంతరం ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చారణలు,మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వైకుంఠ ద్వారాలు తెరిచి స్వామి వారిని దర్శించుకున్నారు.

*ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని,ఆ దేవ దేవుడి ఆశీస్సులు,ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకం పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శక్తిని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment