Home తాజా వార్తలు అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం పట్టివేత*

అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం పట్టివేత*

by Telangana Express

– సిఐ శివ శంకర్

– 11.40 క్వింటాళ్ల బెల్లం విలువ లక్ష పద్నాలుగు వేలు.

– బొలెరో వాహనం సీజ్, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు.

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, జనవరి 28 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
వాహనాల తనిఖీల్లో 11.40 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుకోవడం జరిగిందని సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం  అర్ధరాత్రి సమయంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో  గుర్మిత్కల్ నుండి మహబూబ్నగర్ వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నల్ల బెల్లం ఉన్నట్టు గుర్తించి విచారించగా  కిరణ్, రాజు అనే వ్యక్తులు గుర్మిత్కాల్లోని హనుమాన్ నాయక్ అనే వ్యక్తి వద్ద బెల్లం కొనుగోలు చేసి మహబూబ్నగర్ తీసుకెళ్తున్నామని తెలిపారు. అట్టి నల్ల బెల్లం 38 బ్యాగ్ లు, 11.40 క్వింటాళ్ల ఉండగా వాటి  విలువ 1,14,000/- రూపాయలు ఉంటుందని నల్ల బెల్లాన్ని  అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహన డ్రైవర్ కిరణ్ పట్టుకొగా రాజు పారిపోయాడని తెలిపారు. అట్టి వాహనాన్ని సీజ్ చేసి బెల్లం అమ్మిన వ్యక్తి హనుమాన్ నాయక్  కిరణ్, రాజు ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శివ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

You may also like

Leave a Comment