నాగిరెడ్డిపేట , జూలై 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామ పంచాయతీ రికార్డులను బుధవారం స్థానిక ఎంపీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పంచాయతీ పరిధిలో ఎక్కడ కూడా నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి అని సూచించారు.నీటి నిల్వలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయాలని,పిచ్చి మొక్కలను తొలగించాలని, పారిశుద్ధ్యం నిర్వహణ,మురికి కాలువలో బ్లీచింగ్ పౌడర్ వేసి,గ్రామపంచాయతీ పరిధిలో సాయంత్రం సమయం ఫాగింగ్ చేస్తూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి వార్డ్ ను శుభ్ర పరచడానికి అవసరమైన చర్యలు తీసుకోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని పంచాయితీ సెక్రటరీకి సూచించరు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డి పంచాయతీ సిబంది తదితరులు పాల్గొన్నారు
Latest
బోధన్ రూరల్,జులై26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ మండలం పెంటాకలాన్ గ్రామంలో సీసీ డ్రైన్ నిర్మాణపు పనులను బోధన్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ్ కుమార్, సర్పంచ్ తల్వేద రమణ ప్రారంభించారు. మండల పరిషత్ నిదులు రెండు లక్షల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి :లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్

మిర్యాలగూడ జులై 25 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఉచిత మెడికల్ క్యాంపు లో సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ లు కోరారు. మంగళవారం స్థానిక రైస్ మిలర్స్ భవనంలో ,లయన్స్ క్లబ్ సౌజన్యంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన అనంతరం కర్నాటి రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ కోసం తమ వంతు సహాయంగా గుండె, ఎముకలు, సాధారణ వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో పాటు అతి తక్కువ ఖర్చుతో గుండెకు సంబంధించిన టుడి ఈకో పరీక్షలను నిర్వహించారని తెలిపారు. ఈ క్యాంపులో సుమారు 150 మంది వరకు పరీక్షలుచేయించుకున్నారని,వారికి జనరల్ చెకప్ తో పాటు కార్డియాలజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమం యశోద హాస్పిటల్ డాక్టర్ లోకేష్ కుమార్ గుప్తా, కార్యక్రమం లో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుడిపాటి శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి ( బాబి) కార్యదర్శి రంగా లింగయ్య, కోశాధికారి పైడిమర్రి సురేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఉపాధ్యక్షులు కోలా సైదులు ముదిరాజ్, కార్యదర్శి యనగండ్ల లింగయ్య, కోశాధికారి బాబురావు, సీనియర్ లయన్స్ డాక్టర్ రాజు, వర్షిత హాస్పిటల్ యజమాని డాక్టర్ రాంబాబు, లయన్ బి. ఎం. నాయుడు గుండా రామారావు లతో బాటు లయన్ మెంబర్స్, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు.
దత్తత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడప్రజల బతుకులు మారేది కాంగ్రెస్ తోనేప్రజాహిత పాదయాత్రలో జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడి


రాజాపూర్ జూలై 25:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) రాజాపూర్ మండల్ లో కొనసాగుతున్న ప్రజాహిత పాదయాత్ర మంగళవారం దొండ్లపల్లి, గ్రామం నుండి మొదలై తిర్మలాపూర్, చేన్న వెళ్లి, కుచ్చర్ కల్, మీదుగా రాజాపూర్ చేరుకుంది రాజాపూర్ ముఖ్య కూడలిలో జనంపల్లి అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనురుధ్ రెడ్డి మాట్లాడుతూ.చేక్కంపేట్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు బిఆర్ఎస్ నాయకులు 30 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.ప్రజల బ్రతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బాగుపడతాయని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు అవినీతి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే అలాంటి వారిని గుర్తించి వారి చిట్టాను బయటకు తీస్తానని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.భూ దందాలు, అక్రమ వెంచర్లు నెలకొల్పుతూ ప్రజలను మోసం చేస్తున్న వారి జాబితాను త్వరలోనే బయటికి తీస్తానని అన్నారు.పేదలకు అండగా ఉంటూ వారిని ఆదుకున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు చేతకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారన్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడంలో కెసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజాపూర్ దత్తత తీసుకున్న గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అని ప్రశ్నిస్తూ మండలంలో నేటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిసి కుల వృత్తులకు లక్ష రూపాయలు రుణమంటూ వారిని మభ్యపెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తీర్పు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాజాపూర్ ముఖ్య కూడ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రబ్బాని, రంగారెడ్డి గూడా ఎంపీటీసీ భర్త శ్రీను నాయక్, కత్తెర కృష్ణయ్య, వెంకట్ నాయక్, నసీర్ బైగ్, పోలేపల్లి యాదయ్య, రమేష్ రెడ్డి, గోనెల రమేష్, వనపర్తి రమణ, మంగలి యాదగిరి, శివకుమార్, తక్కీ బాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
దత్తత గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడప్రజల బతుకులు మారేది కాంగ్రెస్ తోనేప్రజాహిత పాదయాత్రలో జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడి



రాజాపూర్ జూలై 25:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్) రాజాపూర్ మండల్ లో కొనసాగుతున్న ప్రజాహిత పాదయాత్ర మంగళవారం దొండ్లపల్లి, గ్రామం నుండి మొదలై తిర్మలాపూర్, చేన్న వెళ్లి, కుచ్చర్ కల్, మీదుగా రాజాపూర్ చేరుకుంది రాజాపూర్ ముఖ్య కూడలిలో జనంపల్లి అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనురుధ్ రెడ్డి మాట్లాడుతూ.చేక్కంపేట్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు బిఆర్ఎస్ నాయకులు 30 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.ప్రజల బ్రతుకులు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే బాగుపడతాయని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.జడ్చర్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు అవినీతి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే అలాంటి వారిని గుర్తించి వారి చిట్టాను బయటకు తీస్తానని టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.భూ దందాలు, అక్రమ వెంచర్లు నెలకొల్పుతూ ప్రజలను మోసం చేస్తున్న వారి జాబితాను త్వరలోనే బయటికి తీస్తానని అన్నారు.పేదలకు అండగా ఉంటూ వారిని ఆదుకున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు చేతకాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారన్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడంలో కెసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజాపూర్ దత్తత తీసుకున్న గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అని ప్రశ్నిస్తూ మండలంలో నేటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిసి కుల వృత్తులకు లక్ష రూపాయలు రుణమంటూ వారిని మభ్యపెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గద్దెనెక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కర్ణాటక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే తీర్పు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాజాపూర్ ముఖ్య కూడ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మళ్లీ పాదయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రబ్బాని, రంగారెడ్డి గూడా ఎంపీటీసీ భర్త శ్రీను నాయక్, కత్తెర కృష్ణయ్య, వెంకట్ నాయక్, నసీర్ బైగ్, పోలేపల్లి యాదయ్య, రమేష్ రెడ్డి, గోనెల రమేష్, వనపర్తి రమణ, మంగలి యాదగిరి, శివకుమార్, తక్కీ బాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కుండపోత వానలతో పొంగిపొర్లుతూన్న వాగులు రహదారులపై భారీ వృక్షాలు నేలకోరిగాయి



మంచిర్యాల, జులై 22, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): గత నాలుగు రోజులుగా కురుస్తున్న గుండెపోత వానలతో వాగులు పొంగిపొర్లుకు, రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. కవ్వాల అభయ రణ్యం అటవీ ప్రాంతం నుండి వరద ఎక్కువ రావడం శుక్రవారం రాత్రి కురిసిన వానతో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం వాగు పొంగిపొర్లుతూ వరద ఎక్కువ కావడంతో శివారులో ఉన్న ఇండ్లలోకి నీరులోకి ప్రవేశించాయి. దీంతో వానలో రాత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచిర్యాల నిర్మల్ వైపు రహదారిపై వెళ్లే వాహనాలు జన్నారం మండలం చింతగూడ బస్ స్టాప్ సమీపంలో బొమ్మన వద్ద భారీ వృక్షం నేలకొరవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షాన్ని రోడ్డుపై తొలగించడంలో అనేక సమయం తీసుకోవడం జరిగింది. భారీ వర్షంలో వృక్షాన్ని రోడ్డు నుండి తొలగిస్తున్నారు. జన్నారం మండలంలో కుండపోత వానులకు రైతుల పంటలకు వేసిన నారు నీటి వరదకు కొట్టుకుపోయింది, పత్తి, కంది, మొక్కజొన్న, పంటలోకి నీరు చేరడంతో రైతుల పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులను ప్రభుత్వం ఆదుకొని, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు మరో మూడు రోజులు ఇలాగే వానాలు కులుస్తాయని తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమమతంగా ఉంటూ ఇంటి నుండి బయటకు రావాలనుకుంటే అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని అధికారులు తెలిపారు.
యన్.సి.సి.(ncc) నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో ఘనంగా, బైబిల్ పంపిణీ
సత్తుపల్లి, జులై 19:(తెలంగాణా ఎక్స్ ప్రెస్ ) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం…ఎ.న్టీ.ఆర్.నగర్ క్రీస్తు సంఘం ప్రార్థనా మందిరంలో రాష్ట్ర అధ్యక్షుడు అలవాల కరుణాకర్. అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బైబిల్ పంపిణీ రామారావును, అభినందనలు తెలిపి, శాలువాతో సత్కారంచి నారు, రామారావు మాట్లాడుతూ క్రైస్తవుల మీద దాడులు చర్చిలు పడగొట్టడం,. లాంటి చర్యలు మానుకోవాలని. ఈ. మధ్య కాలం లొ అదిలాబాద్ ఎంపీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని, చర్చలు కోలగొట్టడం క్రైస్తవుల మీద దాడులు కార్యక్రమాలు మానుకోవాలని, తిరుగుబాటు దారులు హింస హింసకాండతో అట్టడికిపోయిన మణిపూర్ ఈశాన్య రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో కుదుటపడి ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యంలో సంతోషంగా ఉన్న సమయంలో ఈ పక్షపాత చర్యల వల్లే పోలీస్ స్టేషన్ పై దాడులు,ఆయుధ చోరీలు,తో మాణ్ణిపుర్ అట్టడిగి పోయింది, అల్లరి ముకలు ధ్వంసం చేయటంతో,వేల కుటుంబాలు రోడ్డున పడిపోయాయి కర్ఫ్యూ వలన తిండి లేక నీరు లేక ప్రజలు భయభ్రాంతులతో అల్లాడిపోతున్నారు. సిద్ధాంతమే ముఖ్యమని భావిస్తూ ముఖ్యంగా పూర్తిగా బీజేపీ ప్రభుత్వం, ఆర్.ఎస్.ఎస్ కు కొమ్ము కాస్తుంది ఇలాంటి చర్యలు మరలా పునరావతం కాకుండా క్రైస్తవులందరూ ఏకంగా ఉండి పోరాడాలని, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లొ ఎన్. సి సి.కమిటీ సభ్యలు, వరప్రసాద్, సోంసన్, జాన్ మార్క్, రవికిరణ్, జర్జ్, యేసు పాదం, ప్రసాద, రాజేష్, రాంబాబు ఎన్, తదితరులు పిల్లలు పెద్దలు మహిళ్ల పోగొన్నారు.