రాజేశ్వర్ కుటుంబంలోనే తెలంగాణ డిఎన్ఏ ఉంది.
రాజేశ్వర్ రావు విగ్రహం ఆవిష్కరించడం అదృష్టం
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
హుజూరాబాద్, జులై 24 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
సాహిత్యంలో, విద్యారంగంలో, ఆలయాల నిర్మాణంలో, రాజకీయరంగంలో అపారమైన అనుభవం కలిగిన గొప్ప మహానీయులు వొడితెల రాజేశ్వర్ రావు అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు అన్నారు. సోమవారం సైదాపూర్ క్రాస్
రోడ్డులో రాజ్యసభ సభ్యులుస్వర్గీయ వొడితెల రాజేశ్వర్రావు విగ్రహాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావులతో కలిసి మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజేశ్వర్రావు మనువడు, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు వొడితెల బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…వొడితెల రాజేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి తెలంగాణ రాష్ట్రo కోసం పరితపించేవాడని, ముఖ్యమంత్రి కేసిఆర్ వెన్నంటే ఉన్న మహానుభావుడని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ స్ధాయికి ఎదిగి తన ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఘనత సింగాపురం రాజేశ్వర్ రావు ది అని అన్నారు. అనేక విద్యా సంస్థలు నెలకొల్పి వందలాది మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యను అందించారని అన్నారు. తెలంగాణ అవశ్యకతపై రాజేశ్వర్రావు రాసిన వ్యాసాలు ఉద్యోగులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలను ఆలోచింపజేశాయన్నారు. అవి తెలంగాణ ఉద్యమానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. అప్పటి ప్రధాని పివి
నర్సిం హారావు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో రాజేశ్వర్రావు కీలకంగా వ్యవహరించారని, పార్టీలకు అతీతంగా సహాయం చేసే వ్యక్తిత్వం కలిగిన రాజేశ్వర్రావును నర్సలైట్లు కూడా గౌరవి౦చేవారని గుర్తు చేశారు. రాంటేక్ ఇంజనీరింగ్ కళాశాలలో తనకు ఉచితంగా సీట్ ఇచ్చిన మ హానుభావుడు. గురువు విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టంమని మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి, ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసిన ఘనత వొడితెల కుటుంబానికే దక్కుతుందన్నారు. వొడితెల కుటుంబంలోనే తెలంగాణ డీఎన్ఏ ఉందని ఆయన అన్నారు. సింగాపూర్,
హుజూరాబాద్ ప్రాంతాల పై. ఇక్కడ ప్రజలపై రాజేశ్వర్రావుకు ఎనలేని ప్రేమ ఉండేదని. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కవే అని అన్నారు. ఎవరైనా సీటు కావాలని ఇంటికి వచ్చి అడిగితే సాయం చేసే వ్యక్తిత్వం ఆ కుటుంబానిదన్నారు. ఎవరు ఏ సాయం కోసం ఇంటికి వచ్చిన ప్రేమగా. అప్యాయంగా పలుకరిస్తూ చిరునవ్వుతో కడుపునిండ భోజనం పెట్టే వొడితెల కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. ఆ కుటుంబం నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఆ కుటుంబంలోని అన్నదమ్ముళ్ళు కూడా చాలా ప్రేమగా, అప్యాయంగా, ఆత్మీయంగా కలిసి ఉండేవారని గుర్తు చేశారు. సాహిత్యంలో, విద్యారంగంలో, ఆలయాల నిర్మాణంలో, రాజకీయ రంగం. ప్రతి రంగంలో అపారమైన అనుభవం ఉన్న రాజేశ్వర్కు, ముఖ్యమంత్రి కేసిఆర్కు ఉన్న సానిహిత్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. కేసిఆర్తోనే తెలంగాణ సాధ్యమవుతుందని, కేసిఆర్ నాయకత్వాలన్ని బలపర్చాల్సిన అవసరం ఉందని స్వయంగా పుస్తకాలు రాసేవాడని, నిక్కచ్చిగా చెప్పేవాడని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, జెన్కో సీఎండి ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ పివి వాణిదేవీ. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పి చైర్పర్సన్ కనుమల్ల విజయ. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు. సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు. పివి ప్రభాకర్ రావు, పివి మధన్మోహన్రావు, వై. వి చంద్రశేఖర్రావు. పింగిలి వెంకటేశ్వర్రావు. రాజేశ్వర్రావు తనయులు శ్రీనివాసరావు, కిషన్ రావు. వొడితెల కుటుంబ సభ్యులు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు. నాయకులు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.