తాడ్వాయి, మే 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చాలా కాలంగా నీటి ఎద్దడి ఉంది. ఈ సమస్యను గత కొన్ని రోజుల క్రితం ఆ గ్రామ కాంగ్రెస్ నాయకుడు రాజప్ప ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లి బోర్ మంజూరు చేయించాడు. శుక్రవారం బోర్ బండి రావడంతో, కాంగ్రెస్ నేత రాజప్ప పూజ చేసి బోర్ డ్రిల్ చేయించారు. పుష్కలమైన నీరు రావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ..ఎమ్యెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కామారెడ్డి, మే 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ప్రమాదంలో భారత రాజ్యాంగం అనే కరపత్రాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా అంబెడ్కర్ సంగం గౌరవ అధ్యక్షులు మల్లన్న ,జిల్లా అధ్యక్షులు కొత్తల గంగారాం, భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, పీడీయస్. యూ జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ
దేశ భవిష్యత్తును నిర్ణయించేవి పార్లమెంటు ఎన్నికలు
దేశ స్వతంత్రం తర్వాత మన దేశ అభివృద్ధికి బహుజన (బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ) వర్గాల సంక్షేమానికి సామాజిక న్యాయానికి అండగా ఉన్నది కేవలం మన గొప్ప రాజ్యాంగం మాత్రమే సమానత్వం స్వేచ్ఛ ప్రజాస్వామ్య హక్కులు మతసామరస్యం వంటి ఎన్నో హక్కులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగ విలువలకు ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి భావజాలం వ్యతిరేకం
2024లో మోడీ మళ్ళీ ప్రధాని అయితే కొత్త రాజ్యాంగాన్ని తెస్తాం,రిజర్వేషన్లు తీసేస్తాం,ప్రాచీన మనుధర్మాన్ని మళ్లీ అమలులోకి తెస్తాం.
అని బిజెపి నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి.
బీసీ సంక్షేమ సంగం జిల్లా అధ్యక్షులు శివరాములు,బిసి సంగం రాష్ట్ర బాద్యులు మధుసూదన్ ,ఉమ్మడి జిల్లా కురుమ సంగం జిల్లా అధ్యక్షులు మార్కంటి భూమన్న,
2014 నుండి బిజెపి పాలనలో
దళితులు,ఓబీసీలు, ఆదివాసీలపై 48 శాతం దాడులు పెరిగాయి.ఈ దేశంలో నిరుపేదలు అయినా ఓబీసీలు 52 శాతం ఉన్న వారికి రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలకు10% రిజర్వేషన్స్ ఇచ్చి ఓబీసీలకు అన్యాయం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం.దేశంలో కుక్కలు పందులు చివరికి అడవిలో పులుల లెక్క ప్రభుత్వం దగ్గర ఉంటుంది కానీ బీసీ జనాభా శాతం ఎంత ఉందో తెలియదు.
అందుకే బీసీ జనగణన చేయమంటే బిజెపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందని వ్యతిరేకిస్తున్నారు. అసలు బిజెపి నాయకులు రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో బిల్కీస్ భానోపై అత్యాచారం దళిత మైనర్ బాలికలపై దాడులు అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికీ కులం పేరు మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దేశంలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు అలాంటి రైతులకు (స్వామినాథన్ కమిషన్ ప్రకారం) కనీస మద్దతు ధర ఇస్తామని 2014, 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోడీ అమలు చేయకపోగా మూడు కార్పొరేట్ చట్టాలను తీసుకొచ్చాడు అవి రైతులకు నష్టాన్ని తెచ్చేవిగా ఉన్నాయని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలల పాటు నిరసన చేస్తే అమాయకులైన రైతులపై దాడులు చేయడం వల్ల 750 మంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. మోడీ పాలనలో ప్రతి 45 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య జరిగింది. ఇదేనా ప్రపంచానికి తిండి పెట్టే రైతుకు మనం ఇచ్చే విలువ.
ఆదాని,అంబానీ,వాల్మార్ట్ మొదలగు బడా కంపెనీలకు లక్షల కోట్లు మాఫీ చేసిన బిజెపి ప్రభుత్వం రైతులకు చిన్న వ్యాపారులకు అండగా ఉండదా? ఇదేనా ప్రజాస్వామ్యం?
బిజెపి ఎన్నికల మేనిఫెస్టో ఎంతవరకు అమలుచేశారూ అని అడుగుతున్నారు.
ఏక్ బారత్ శ్రేష్టభారత్ సబ్కా సాత్ సబ్ కా వికాస్ (ఒకే భారతం ఉత్తమభారత్ అందరికీ ఐక్యత మరియు అభివృద్ధి )ఈ నినాదంలో ఐక్యత అనేది ఎక్కడ కనిపిస్తుంది. మణిపూర్ రాష్ట్రం మారణకాండ లో విచక్షణ రహితంగా గిరిజన మహిళలు చిన్నపిల్లల మీద కూడా దాడి చేసి చంపినా,ఇల్లు తగలబెట్టినా కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.ఆ రాష్ట్రం మన దేశంలోనిది కానట్టు ప్రవర్తించి నెలల పాటు నెట్వర్క్ బంధు చేసి దాడులు చేయడం లో ఎక్కడ సమానత్వం ఉంది .ఈరోజు మోడీ మైనార్టీల మీద చూపిస్తున్నటువంటి ద్వేషం, వివక్ష వలన ఐక్యత ఎట్లా చేకూరుస్తుంది. మైనార్టీలను రెండవ పౌరులుగా చూడడం ఎంతవరకు సమంజసం.
ఇక అభివృద్ధి పార్లమెంట్ సాక్షిగా 85% ప్రజలకి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నమని చెప్పడం జరిగింది. ప్రజలు అభివృద్ధి జరిగితే ఉచిత బియ్యం ఎందుకు అవసరం? ఇక్కడ ప్రజలు అభివృద్ధి జరగలేదు గుజరాత్ కి సంబంధించినటువంటి ఎనిమిది మంది వ్యాపారవేత్తలను అభివృద్ధి చేయడం జరిగింది. లక్షల కోట్ల డబ్బులను వారికి మాఫీ ఇచ్చి వారిని అభివృద్ధి
చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో స్వేతా పత్రం విడుదల చేయాలి.
బేటి బచావో బేటి పడావో అనే నినాదంతో ముందుకు వచ్చిన మోడీ ఎక్కడ భేటి బచావో చేశారు. బిల్కిస్ బానో లాంటి స్త్రీలను అత్యాచారం చేసిన దుర్మార్గులను కోర్టు నుండి విడిపించి సన్మానం చేసిన ఘనత బిజెపి,ఆర్ఎస్ఎస్ లది కాదా? ఇక్కడ భేటీ బచావా అమలైందా? సాక్షి మాలిక్ మొదలగు మహిళా బాక్సర్లను అవమానించిన వారికి మద్దతు ఇచ్చిన బిజెపిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ బేటి బచావో ఉంది.
బేటి పడావో కేటాయించిన బడ్జెట్లో 25% కూడా ఖర్చు పెట్టలేదు భేటీ ఎలా చదువుకుంటుంది.
ప్రజలారా అర్తం చేసుకోండి ఏ ఒక్కటి కూడా రాజ్యాంగ బద్దంగా అమలు చేయడం లేదు. అది కాకా రాజ్యాంగన్నే మారుస్తాం అంటున్నారు.
మన చేతులో గొప్ప ఆయుధం ఉంది అదే ఓటు ఒక్కసారి దానిని మన కోసం,మన పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించండి.ఓటును ఇలాంటి మన,పిల్లల బతుకులను నాశనం చేసే వారికోసం వేయకండి.ఓటు వేసే ముందు ఒక్కసారి మీ పిల్లల బతుకును ఆలోచించండి.దయచేసి ఆలోచించమని ప్రార్థిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో నారాయణ రావు ,అజీ అబ్దుల్ అజీజ్, అణ్వర్ పాషా,ఆర్బాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ.పాటిల్ విజయం కోసం ఆయన తనయుడు అభిషేక్ పాటిల్ ఎల్లారెడ్డిలో బుధవారం వ్యాపారస్థుల వద్దకు వెళ్లి తన తండ్రిని గెలిపించాలని కోరారు. ఎల్లారెడ్డి బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులతో కలిసి పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో, వ్యాపార సముదాయల్లో ప్రచారం నిర్వహించారు. దేశంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని మెజార్టీ ప్రజలు నిరయించుకున్నారన్నారు.
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 3వ వార్డులో ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజార్ ఖాద్రి మాజీ కో- ఆప్షన్ రఫీక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టో ను ఓటర్లకు వినిపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తుకారం, ముమైత్, తబ్రేజ్ , జమీల్, రాహుల్, ఆదిల్, ఆసిఫ్, అదీప్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 7, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన, మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన కథనం ప్రకారం వివరాల ఇలా ఉన్నాయి. బిక్కనూర్ గ్రామానికి చెందిన బేస్త కృష్ణ ( 20) అనే యువకుడు జీవితం పై విరక్తి చెంది మనస్థాపానికి గురై మండలంలోని మల్లయాపల్లి గ్రామ శివారులోని పోచారం కాలువ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి కి గల కారణాలు ఆరాతీశారు. మృతుడి పెద్ద నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బొజ్జ మహేశ్ వివరించారు.
ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నవీద్
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్ )అధ్యక్షులు న్యాయవాది నవీద్ అన్నారు. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి పరిధిలో ఉపాధి హామీ పనుల వద్దకు తన అనుచరులు, పార్టీ నాయకులతో వెళ్లి ప్రచారం నిర్వహించారు. జహీరాధాతఙషుడుబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మ్యానిపేస్టోను కూలీలకు వివరించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నస్యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)నాగిరెడ్డిపేట్ మండలం జప్తిజాన్కంపల్లికి చెందిన బి. రాములు (70) అనే ఉపాధి హామీకూలి గుండెపోటుతో మృతి చెందాడు. భూమని రాములు శనివారం ఉదయం జప్తి జానకంపల్లి గ్రామ శివారులోని మల్లార్ చెరువులో ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఉపాధి హామీ పనులు ప్రారంభించడానికి ముందే రాములుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునడికి భార్య సాయవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ
ఎల్లారెడ్డి, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ కలియుగ దైవం అయిన అయ్యప్ప ఆలయంలో మళ్ళీ దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి గర్భగుడిలో దొంగ ప్రవేశించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ , ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటలకు పూజారి శ్రీనివాస్ రావు ఆలయానికి వచ్చి గర్భ గుడి తాళం పగుల కొట్టి వుండాటాన్ని చూసి వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కమిటీ ప్రతినిధులు పోలీసులను పిలిపించి సీసీ పుటేజిలను పరిశీలించగా ఆలయ గర్భగుడి తాళాలు పగుల గొట్టి లోనికి వెళ్లిన దొంగ చిత్రం క్లియర్ గా పోలీసులకు చిక్కింది. ఆ చిత్రాన్ని చూసిన పోలీసులు మధ్యాహ్నం వరకు దొంగను పట్టుకొని తీరుతామన్నారు. ఇప్పటికే ఆలయంలో మూడు సార్లు దొంగతనం జరిగింది. దొంగ ప్రతి సారి హుండీ పగుల గొట్టి డబ్బులు తీసుకొని పోతుండటంతో ఆలయ కమిటీ హుండీని తీయించి వేసింది. అంతే కాకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో దొంగ చిత్రం బయట పడింది. దొంగ పెట్టుబడి అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు దొంగతనం జరగడంతో ఆలయ గర్భ గుడిలో స్వామి విలువైన నగలు పెట్టడం లేదు. దొంగకు గర్భగుడిలో ఎం దొరక్క పోవడంతో ఉదయం పూజకు ఉంచిన పండ్ల బుట్టను ఎత్తు కెళ్లినట్లు గుర్తించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడిలోకి ఆలయ పూజారి తప్ప ఎవరికి కూడా ప్రవేశించే అర్హత ఉండదు. దొంగ గర్భగుడి లోపలికి ప్రవేశించడంతో ఆలయ పూజారీ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనే భక్తుల భారీ విరాళాలతో దాదాపు 4కోట్లకు పైగా వెచ్చించి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కేరళలోని శబరిమల ఆలయాన్ని పోలి గుడి కుంటల స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కామారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పాటుతో మొదటి కలెక్టర్ గా వచ్చిన కలెక్టర్ డాక్టర్.సత్యనారాయణ ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆలయ నిర్మాణం పూర్తిగా పరిశీలించి ఆలయ నిర్మాణం తీరు పట్ల అభినందించిన విషయం గమనార్హం. అయ్యప్ప ఆలయం ఎదురుగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. సెలవులు కావడంతో విద్యాలయం కూడా మూసి ఉండటం వల్ల, దొంగ ఆలయ గర్భగుడి పెద్ద తాళాలు పగుల గొట్టిన శబ్దం ఎవరికి వినబడదు. రాత్రి పూట ఆలయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని భక్తులు పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసు నమోదు చేశాం…దొంగను పట్టుకుంటాం. నైట్ పెట్రోలింగ్ పెంచుతాం…
సీఐ. రవిందర్ నాయక్
ఎల్లారెడ్డి సీఐ. రవీంద్రనాయక్ మాట్లాడుతూ…అయ్యప్ప ఆలయంలో జరిగిన దొంగతనం పై కేసు నమోదు చేశామని దొంగను పట్టుకుంటామని, అలాగే ఆలయం వద్ద రాత్రి పెట్రోలింగ్ పెంచుతామన్నారు.
మేడ్చల్, మే 2,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):మేడ్చల్ పరిధిలోని కొంపల్లి శాఖ -1 శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరములో 10వ తరగతిలో అత్యధిక 10/10 జీపీఎస్ మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచి విజయ దుందుభి మోగించారని , ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు ఆఫ్ సెకండరీ వారు మంగళవారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో, తమ పాఠశాల నుంచి 21 మంది 10/10 జీపీఎస్, 35 మంది 9.8/10 జీపిఎస్ మార్కులు సాధించి పాఠశాలకు, తల్లి దండ్రులకు మంచి పేరు తెచ్చారన్నారు. హాజరైన విద్యార్తులలో 60 శాతం మంది పైన 9 ఆపైన జిపిఎస్ మార్కులు సాధించడం గర్వకారణం అని పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎ.జి.యం. జి.వి. రమణా రావు విద్యార్థులను, తల్లి దండ్రులను, ఉపాద్యాయ బృందం ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, కో ఆర్డినేటర్ శ్రీ జైపాల్ రెడ్డి, డీన్స్ సోమేశ్వర్ రావు , శ్రీ అఖిల్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డు లో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం గురువారం కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను గెలిపిస్తే ఎల్లారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని గడపగడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తుందని ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు . ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , చెన్న లక్ష్మణ్, షేకావతలి, గఫర్, వినోద్ గౌడ్, నాగం సాయిబాబా, సొసైటీ డైరెక్టర్ గోపికృష్ణ, శంకర్ 11వ వార్డు ఇంచార్జ్ కిషన్, బాలయ్య, రాములు, సాయిలు, కాశీరాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.