నెరవేరుతున్న రెండు దశాబ్దాల భక్తుల కల
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ జనవరి 1వెల్గటూర్ మండలంలోని అయ్యప్ప భక్తుల ఆలయ నిర్మాణం కల ఎట్టకేలకు నెరవేర బోతుంది. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆ డ్లూరి లక్ష్మన్ కుమార్ గురువారం మండల కేంద్రంలోని పెద్దవాగు తీరంలో శ్రీ ధర్మ శాస్త స్వామి అయ్యప్ప ఆలయానికి వేద పండితులు బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మండలంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసం అయ్యప్ప స్వాములు మండల వాసులు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. చాల రోజులుగా ఆలయ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు. ఇప్పటి వరకు ఆలయానికి స్థల సేకరణ కూడా సాధ్యం కాలేదు. ఎట్ట కేలకు స్వామి మాల దారణలో ఉన్న విప్ ఆడ్లూరి లక్ష్మన్ కుమార్ చొరవ తీసుకొని మేఘా కంపెనీ ఆధీనంలో ఉన్న స్థలాన్ని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసం ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం కాగా అయ్యప్ప భక్తుల కల నెర వెర బోతోంది. ఈ సందర్బంగా విప్ మాట్లాడుతూ… అయ్యప్ప స్వామి ఆలయం వేగవంతంగా పూర్తి చేయడానికి మేఘా కంపనీ తో పాటు మండల ప్రజల సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు. స్వామి ఆలయానికి పెద్దవాగు తీరంలో మంచి స్థలం దొరికింది.రాబోయే కాలంలో ఇది గొప్ప తీర్థ కేత్రంగా మారబోతుందని అన్నారు. వచ్చే అయ్యప్ప సీజన్ వరకు స్వామి ఆలయాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసు కుంటానని, ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని విప్ హామీ ఇచ్చారు. స్వామి ఆలయ భూమి పూజకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసారు.ఈ కార్యక్రమంలో పొనుగోటి రాం మోహన్ రావు, గోళ్ళ తిరుపతి, శైలెందర్ రెడ్డి, దినేష్, మురళి, ఉదయ్, మెరుగు నరేష్, వెంకటేష్,జీరెడ్డి మహేందర్ రెడ్డి,గూడ రాంరెడ్డి, పూదరీ రమేష్ పత్తిపాక వెంకటేష్ ,రత్నాకర్, టీ. చంద్రమౌళి, పెద్ది శ్రీనివాస్, రామచంద్రం రేగొండ రామన్న, వెంకట్ రెడ్డి గాజుల సతీష్, కూస లక్ష్మన్, జూపాక ప్రవీణ్ , మనీష్, సంకోజు నరేష్ సురేష్ పెద్దూరి భరత్ సిరంగి లక్ష్మణ్ కంటెం ప్రవీణ్ గాజుల సుమన్ బోడ కుంటి రమేష్ పులి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

