Home తాజా వార్తలు గ్రామాలలో ఓటు వేసే వి వి ప్యాడ్ తో విధానాన్ని ప్రజలకు వివరిస్తున్న బిఅర్ఎస్ యువ నాయకులు

గ్రామాలలో ఓటు వేసే వి వి ప్యాడ్ తో విధానాన్ని ప్రజలకు వివరిస్తున్న బిఅర్ఎస్ యువ నాయకులు

by Telangana Express

సైదాపూర్, నవంబర్ 27
, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

మండలం పెర్కపల్లి గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసే విధానాన్ని ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బిక్షపతి అశోక్ శ్రీనివాస్ పద్మ రమేష్ లక్ష్మి వివరించారు. సోమవారం మండలంలోని పె ర్కపాల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పిళ్లి కొమురయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. పేదలు, ప్రజలు, రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, తదితర పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకవచ్చారన్నారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు కోసం రైతు వేదిక భవనాలను నిర్మించారన్నారు. మహిళల కోసం కెసిఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, తదితర పథకాలను రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించి, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలను పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల వరకు అనేక పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు. ప్రస్తుత బిఆర్ఎస్ మేనీపోస్ట్ లలో కెసిఆర్ భరోసా, ఎకరాకు యెాటా 16 వేల, వృద్ధులకు 5016 దశలవారీగా, అర్హులైన పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే, అన్నపూర్ణ పథకం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఆరోగ్య భీమా 15 లక్షలు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రారంభిస్తారని, ప్రజలకు తెలియజేశారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి హుస్నాబాద్ శాసనసభ్యులు బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ ను
ను భారీ మెజార్టీతో గెలుపొందించాలని ప్రజలతో అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిక్షపతి శాఖ అధ్యక్షులు పిల్లి కొమురయ్య నాయకులు ఉప సర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ దేవేందర్ అశోక్ సంగ కుమార్ యాదగిరి ఓదేలు కిరణ్ అరుకల రమేష్ అశోక్ మహిళా నాయకురాలు పద్మ నిర్మల రేష్మ లక్ష్మి వెంకవ్వ పద్మ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment