Home తాజా వార్తలు తల్లిపాలు బిడ్డకు సురక్షితం
పల్లె దవాఖాన డాక్టర్ రోహిత్ రెడ్డి

తల్లిపాలు బిడ్డకు సురక్షితం
పల్లె దవాఖాన డాక్టర్ రోహిత్ రెడ్డి

by Telangana Express

వేములపల్లి, ఆగస్టు 2( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో పల్లె దవఖన దగ్గర తల్లిపాల వారోత్సవాలు అవగాహన సదస్సును డాక్టర్ రోహిత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు సురక్షితమని తల్లిపాలతోనే శిశువు ఆరోగ్యంగా పౌష్టికంగా ఉంటారని అన్నారు. ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు ప్రమీల,జయమ్మ, అంగన్వాడీ టీచర్ నక్క సుభద్ర, ఆశ వర్కర్లు రేణుక,నాగమ్మ,ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment