తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 25
అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ఎలుక భగవాన్ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల బాబురావు యాదవ్ హైదరాబాద్ లోని సంఘ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎలుక భగవాన్ యాదవ్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా యాదవుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న తన సేవలను గుర్తించి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్ కు, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి రమేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల రాజేందర్ యాదవ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పలుమారు మల్లేష్ యాదవ్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎలుక రాజు యాదవ్, బొబ్బిలి వెంకటస్వామి, ముఖేష్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా భగవాన్ యాదవ్ నియామకం పట్ల అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వెల్గటూర్ మండల స్థానిక నాయకులు అల్లే వెంకటేష్ యాదవ్, మాచర్ల రాజేందర్ యాదవ్, నక్క లక్ష్మణ్ యాదవ్, గెల్లు చంద్రశేఖర్ యాదవ్, రాపాక మహేందర్ యాదవ్, మేకల సంతోష్ యాదవ్, కూస లక్ష్మణ్ యాదవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


