Home తాజా వార్తలు జేడీ వీ వి లక్ష్మీనారాయణ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి చేతుల మీదుగాఆనందితా ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్‌కు ఉత్తమ సేవ పురస్కారం.

జేడీ వీ వి లక్ష్మీనారాయణ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి చేతుల మీదుగాఆనందితా ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్‌కు ఉత్తమ సేవ పురస్కారం.

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 27/01/25
నిరుపేద విద్యార్థులకు ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు అందిస్తూ, సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన ఆనందితా ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వాడేకర్ లక్ష్మణ్ ఉత్తమ సేవ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారాన్ని జేడీ లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అందజేశారు.
ఈ ఘనతను వాసవి వర్డ్ స్కూల్, ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాడేకర్ లక్ష్మణ్ కి ప్రదానం చేశారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,సేవా కార్యక్రమాలలో ముందుండి తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్న లక్ష్మణ్ యువతకు ఆదర్శప్రాయులు అని ప్రశంసించారు.
సామాజిక సేవలో ఆనందితా ఫౌండేషన్ పాత్ర
ఆనందితా ఫౌండేషన్ గత కొంతకాలంగా నిర్మల్ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ, ప్రజలకు రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, తదితర సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. లక్ష్మణ్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం ఎన్నో శిక్షణా తరగతులు నిర్వహించడమే కాకుండా, కార్పొరేట్ కంపెనీలు, విద్యాసంస్థలు, యువత, నిరుద్యోగ యువతకు మార్గనిర్దేశం చేస్తూ, సమాజంలో స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచారు.
ముఖ్య అతిథులు.
ఈ కార్యక్రమంలో వాసవి వర్డ్ స్కూల్ డైరెక్టర్ ముత్యం రెడ్డి, హ్యాండ్‌రైటింగ్ నిపుణులు డా. మల్లికార్జున రావు, విద్యార్ధులు, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు హాజరై వాడేకర్ లక్ష్మణ్ ని అభినందించారు.
లక్ష్మణ్ స్పందన.
ఈ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ,ఈ గుర్తింపు నా సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తోంది. సమాజానికి మేలు చేయడం నా బాధ్యతగా భావించి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాను అని అన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, నిర్మల్ వాసులు ఆనందితా ఫౌండేషన్ సేవలను కొనియాడుతూ, లక్ష్మణ్ భవిష్యత్ కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like

Leave a Comment