Home తాజా వార్తలు అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా..

అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తా..

by Telangana Express

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 29

వెల్గటూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు నా సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉంటాయని అయ్యప్ప స్వాములకు విప్ ఆడ్లూరిలక్ష్మన్ కుమార్ హామీ ఇచ్చారు.వెల్గటూర్ మండల కేంద్రంలో నూతనంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాలని వెల్గటూర్ మండల అయ్యప్పలు ఆదివారం ధర్మపురి క్యాంపు కార్యాలయానికి తరలి విప్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప స్వాముల విజ్ఞప్తికి విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మన్ కుమార్ సానుకూలంగా స్పందిం చారు. ఆలయానికి అవసరమైన స్థలమును మండల కేంద్రం లోని పెద్దవాగు తీరంలో ఇప్పటికే గుర్తించామన్నారు.అదే స్థలంలో నూతన సంవత్సరం సందర్బంగా ఆలయానికి భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం మొద లుకొని పూర్తి అయ్యేంత వరకు అన్ని విధాల తన సహకారం ఉంటుందని విప్పు హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయ్యప్ప గుడి కల త్వరలో నెరవేర బోతుందని అయ్యప్పలు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా శబరి యాత్రకు ఆర్టీసీ ద్వారా వెళ్లే స్వాములకు తమిళనాడు బోర్డర్ టాక్స్ మాఫీ కోసంరాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో విప్ మాట్లాడగా ఆయన సానుకూలంగాస్పందించారుఈ సందర్భంగా స్వాములు ప్రభుత్వ విప్ ని శాలువతో సత్కరించి, అయ్యప్ప స్వామి వారి ఫోటో అందించి కృతజ్ఞతలు తెలిపారు… ఈ కార్యక్రమం లో గండ్ర శ్రీకాంత్ రావు, గుండాటి సందీప్ రెడ్డి,కొత్త తిరుమల్, గురు స్వాములు చంద్రమౌళి, పెద్ది శ్రీనివాస్ నరేష్ స్వామి, రామస్వామి తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment