జోగిపేట డిసెంబర్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో అయ్యప్ప స్వామి శోభాయాత్ర కార్యక్రమం మంగళవారం నిర్వహించారు, గుర్రపు బండిపై అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఉంచి, గ్రామ పురవీధుల మీదగా ఊరేగించారు, గంగాధర్ శర్మ గురు స్వామి ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం జరిగింది, కళాకారుల విన్యాసాలు, కేరళ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, గ్రామస్తులు మంగళ హారతులతో శోభాయాత్ర కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
