మేడ్చల్, ఏప్రిల్ 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ (ఐ ఎన్ టి ఎస్ ఓ) పరీక్ష ఫైనల్ స్టేజ్ ఫలితాల్లో, మేడ్చల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి లో గల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయ భేరి మోగించారు అని పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐ ఎన్ టి ఎస్ ఓ 2023 – 24 విద్యాసంవత్సరంకు గాను జరిగిన పరీక్షల తుది ఫలితాల్లో పాఠశాల నుంచి 287 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ – మె రిట్ సర్టిఫికెట్స్ సాధించారని అన్నారు. జి. క్రిశాంగ్ , ఏ.హర్ష వర్ధన్ లు ట్యాబ్ లను మొదటి బహుమతులుగా గెలుచు కున్నారని, ఏ.వర్షిత్, పీ.శ్రీ చరణ్, ద్వితీయ బహుమతులు, జి.మణితేజరెడ్డి, ఎం.రుత్విక్, ఎం.సుజయ్, ఏ .సాయి అక్షిత్ రెడ్డి లు 4వ బహుమతులను, ఎం. వర్షిత్ పటేల్, ఎన్.జ్ఞానేశ్వర్, పీ.గౌతం లు 5వ బహుమతులను గెలుచు కున్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. తమ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు ఇది చక్కని నిదర్శనం అని ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి కొనియాడారు. చక్కని ప్రతిభ కనబరిచే విధంగా విద్యా ర్థులను సంసిద్దులను చేసినందుకు గాను చైతన్య విద్యా సంస్థల కొంపల్లి జోన్ ఏ జి ఎం జీవి రమణ రావు, జోన్ కో ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి , డీన్ సోమేశ్వర్ రావు, అఖిల్ విద్యార్థులను వారి తల్లి తండ్రులను, ఉపాద్యాయ బృందంను ప్రత్యేకంగా అభినందించారు.