ఎల్లారెడ్డి, మే 1,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):గృహ, గృహేతర విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని , కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్ బాబు విద్యుత్ సిబ్బందికి ఆదేశించారు. బుధవారం ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ పరిధిలోని లింగంపేట్, పోతాయిపల్లి 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎస్ ఈ ఆకస్మిక తనిఖీచేశారు. ఈ సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతున్నదా లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో వెళ్ళి పరిశీలించారు. ఆతర్వాత ఎస్ ఈ రమేష్ బాబు విద్యుత్ ఉద్యోగులలో కలిసి మాట్లాడుతూ, వేసవి కాలం నేపథ్యంలో ఎప్పటి కప్పుడు విద్యుత్ లైన్లను తనిఖీలు చేస్తూ, అవసరమైన మరమ్మత్తులు చేస్తూ, అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. 24 గంటలు స్థానికంగా అందు బాటులో ఉండాలని సంబంధిత విద్యుత్ శాఖ ఉద్యోగులను ఆదేశించారు.
లింగంపేట్ , శెట్పల్లి సంగారెడ్డి సబ్ స్టేషన్ పరిధిలోని 11 కెవి ఫీడర్లలో 200 ఇంటర్మీడియట్ పోల్స్ లను ఏర్పాటుచేసి అంతరాయలు లేకుండా 11 కెవి విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్న సిబ్బంది పని తీరునిచూసి అభినందించారు. అలాగే మూడు 11 కేవీ లైన్ ఏ బి స్విచ్ లను ఏర్పాటు చేసి సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వేరొక ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు చేసిన ఏర్పాట్లను పరేశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవి కాలంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్దం చేసుకో వాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్ బాబు వెంట ఎల్లారెడ్డి డివిజనల్ ఆపరేషన్స్ డి ఈ గణేష్ , ఏ డీ ఈ తిరుపతి రెడ్డి, ట్రాన్స్ కో ఏఈ లు సాయినాథ్, హరీష్, ఎన్.సత్య నారాయణ, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
V.Rajendernath
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 30:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి మండలం హజీపూర్ తాండలో సభవత్ మున్య బెల్టు దుకాణం నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. 6మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసలు, ఆ వలసలు బీజేపీలో మొదలయ్యాయి. సోమవారం రాత్రి ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన బీజేపీ యువకులు 30 మంది కాంగ్రెస్ లో చేరారు. గాంధారి మండలం గండివేట్ గ్రామానికి చెందిన బీజేపీ యువకులు 30 మంది కాంగ్రెస్ లో చేరగా, వారికి ఎమ్యెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటాం…కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ ఆశీర్వదించండి…బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 29:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)అన్నదాతలకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని… ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ శేట్కర్ కు గెలిపించాలని కోరుతూ.. ఆయనకు మద్దతుగా ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ పరిధిలోని జాన్కంపల్లి కుర్దు నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభించారు. లక్ష్మాపూర్, హాజీపూర్ తండా , అడవి లింగాల్, కొక్కొండ, గండిమాసాని పేట్ తదితర గ్రామాలలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఐదు గ్యారంటీ లను అమలు చేశామని మహిళలకు పెద్దపీట వేషామన్నా
రు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, కరెంట్ జీరో బిల్లు, 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంపు చేయడం జరిగిందన్నారు. 10 సంవత్సరాలలో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఉన్న బీబీ పార్టీ ఎల్లారెడ్డి నియోజక వర్గానికి చేసింది ఏమి లేదన్నారు. ప్రజలకు ఏమి చేసిండు ప్రతి ఇంటికి తెలపాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారంటీ లతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగు తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్షగా పనిచేస్తాయన్నారు. నాల్గవ విడత మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, జడ్పిటిసి ఉష గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించాము
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల కమీషన్ రూపొందించిన ఆన్ లైన్ సాఫ్ట్ వెర్ ద్వారా 20 శాతం అదనంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇద్దరు పోలింగ్ సిబ్బందితో 1,093 బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు కేటాయించామన్నారు. అదేవిధంగా 30 శాతం అదనంగా మొదటి విడత 85 మంది మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా వర్చువల్ విధానంలో సంగారెడ్డిలో ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఉన్న ఎన్నికల సాధారణ పరిశిలకులు గోపాల్ జి తివారి సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని, వారు నిశితంగా పరిశిలించారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, దివ్యంగులచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలకు కూడా పోలింగ్ సిబ్బందిని కేటాయిచామని కలెక్టర్ తెలిపారు. 4,388 మంది పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, రెండవ విడత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని సాధారణ పరిశీలకులకు తెలిపారు. రిజర్వు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారని, పోలింగ్ కేంద్రాలకు కేటాయించబడిన ప్రతి బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఒ రాజారామ్, మ్యాన్ పవర్ నోడల్ అధికారి వరద రెడ్డి, రాష్ట్ర యెన్.ఐ.సి. అధికారి రవి, జిల యెన్.ఐ.సి అధికారి శ్రీకాంత్, కలెక్టరేట్ ఏ.ఓ. మసూర్ అహ్మద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి.. ఎన్నికల సాధారణ పరిశీలకులు మోతిలాల్ షెటే
కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులు మోతిలాల్ షెటే (Mothilal shete-2014 batch) సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, అభ్యర్థుల వ్యయ నిర్వహణ, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టికల్ సర్వేలెన్స్ బృందాల పనితీరు, అక్రమ డబ్బు, మద్యం స్వాధీనం, కేసులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ మాట్లాడుతూ ఎన్నికలలో అభ్యర్థులు చేసే ఖర్చును అకౌటింగ్ టీమ్ పక్కాగా నిర్వహించాలన్నారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎలా లెక్కించాలి, రిజిస్టర్లల్లో ఎలా నమోదు చేయాలో అకౌంటింగ్ టీమ్ కు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.వీడియో సర్యేలెన్సు టీమ్ ఇచ్చే వీడియో ఫుటేజీ, ఎవిడెన్స్ ఆధారంగా ఖర్చును లెక్కించి జాగ్రత్తగా అభ్యర్థి షాడో రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టికల్ సర్వేలెన్స్ టీమ్ , ఏం.సి.ఏం.సి.తదితర అన్ని కమిటీలు నుండి సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగా ఖర్చును లెక్కిస్తూ రోజు వారి నివేదికలు సమర్పించాలని సూచించారు. అభ్యర్థి ఖర్చు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలన్నారు. అకౌంటింగ్ నిర్వహణలో ఏ అనుమానాలున్న వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. 10 లక్షల పైగా జరిగే అనుమానస్పద బ్యాంకు లావాదేవీలు, బహుమతుల తరలింపుపై నిఘా ఉంచాలన్నారు. కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల్లో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. నిఘాకు ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ టీములని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కమిటీ ద్వారా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారంపై పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రచారానికి ప్రకటనలు, పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా చూపాలన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు వివిధ బృందాలు, పోలీస్ శాఖ ద్వారా 72 మంది నుండి కోటి 38 లక్షల 68 వేల నగదును పట్టుకొని సరైన పత్రాలు చూయించిన 57 మందికి 72 లక్షలు తిరిగి అందజేశామని, 53 లక్షల నగదుపై ఆదాయపు పన్ను శాఖ వారికి అప్పగించామన్నారు. అదేవిధంగా పొలిసు, ఆబ్కారీ శాఖలు సంయుక్తంగా 55 లక్షల 57 వేల విలువ గల 40,123 లీటర్ల మద్యాన్ని, 40 వేల విలువ గల 143 కిలోల గంజాయి వంటి మత్తు పదార్థాలను పట్టుకున్నామని వ్యయ పరిశీలకులకు తెలిపారు. జిల్లాలో 913 పోలింగ్ కేంద్రాలకు గాను 64 సమస్యాత్మక లొకేషన్లు, 183 సమస్యాత్మక పోలింగ్ స్టేషనలను గుర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకునుంటామన్నారు. 516 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. వ్యయ నిర్వహణకు వ్యయ పరిశిలకులతో పాటు 34 అకౌంటింగ్ బృందాలు, వీడియో వీవింగ్,, వీడియో సర్వేలెన్స్, ఎఫ్.ఎస్.టి. ఎస్.ఎస్.టి బృందాలను, 94 మంది సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా పర్వయికేశీంస్తుండడంతో పాటు 1950 టోల్ ఫ్రీ నెంబరు, స్-విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నామని మోతిలాల్ కు వివరించారు.
ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ రెండు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు లతో పాటు, జిల్లా సరిహద్దు చెక్ పోస్టులపై గట్టి నిఘా పెట్టమని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో తగు బందోబస్తు ఏరిపాటు చేస్తున్నామని, ఆయుధ లైసెన్సులు కలిగిన 25 మంది పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారని అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఒకరిపై కేసు నమోదు చేశామని, అక్రమ డబ్బు,మద్యం పై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ ఎస్పీ కాజల్, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ రవీంద్ర రాజు, నోడల్ అధికారి అంబాజీ, ఆదాయపు పన్ను అధికారి మనోజ్ కుమార్, సీవాణిజ్య పన్నుల అధికారి శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ వ్యయ పరిశీలకులు మోతిలాల్ షెటే కు స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్పీలు
కామారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లాకు శుక్రవారం వచ్చిన జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ వ్యయ పరిశీలకులు మోతిలాల్ షెటే, (ఐ.ఆర్.ఎస్. 2014)ను జిల్లా కలెక్టర్జితేష్ వి పాటిల్ , ఎస్పీ సింధు శర్మలు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, వ్యయ నిర్వహణ కమిటీ, సహాయ వ్యయ పరిశీలకుల నియామకం, వ్యయ మానిటరింగ్ చేస్తున్న తీరుపై వారికి వివరించారు.
కౌన్ బానేగా జహీరాబాద్ షా …రోజురోజుకు వేడెక్కుతున్న ఎన్నికల రాజకీయాలుముగిసిన నామినేషన్ల పర్వం…బీఆర్ఎస్ కంచుకోటను కాపాడుకునేందుకు కారు యత్నం….పాగ వేయాలని హస్తం ఆరాటం….వికసించాలని కమలం …జహీరాబాద్ స్థానంలో త్రిముఖు పోరు….గెలుపుపై ఎవరి ధీమా వారిదేఓటరు చేతుల్లో నేతల తలరాతలు ….ఎన్నికల ప్రచారానికి త్వరలో అగ్రనేతలు రాక ….మహిళా ఓటర్లె కీలకం…
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
వచ్చే నెల మే 13 న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం…వివిధ రాజకీయ పార్టీల నాయకుల ప్రచారంతో రాజకీయాల్లో రోజురోజుకు వేడెక్కుతుంది. నామినేషన్ ల స్వీకరణ పర్వం ముగియడంతో అగ్ర నేతలు అంతా ప్రచారంపైనే దృష్టి సారించారు. మరొక వైపు నామినేషన్ల ప్రక్రియ కొన సాగుతుందని అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. జహీరాబాద్ స్థానం నుంచి ప్రధాన పార్టీలైన బిజేపి, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరి పోరు కనబడుతుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా 15 రోజుల గడువు ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకు నేందుకు ప్రచారం ముమ్మరం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్, జుక్కల్, ఎల్లారెడ్డి , బాన్సువాడ, కామారెడ్డి, ఏడు స్థానాలలో సుమారు 14 లక్షల పైన మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు బిబి పటేల్ గెలుపొందారు. బిబి పాటిల్ కారు దిగి కమలదళంలో చేరారు. బిఆర్ఎస్ కంచుకోటను కాపాడుకునేందుకు కారు యత్నం చేస్తున్నారు. ఈ స్థానాన్ని ఎలాగైనా కైవాసం చేసుకోవాలని హస్తం పార్టీ పాగా వేసింది. ఈ స్థానాన్ని కమలం వికాసంతో ప్రధాని నరేంద్ర మోడీని మూడవసారి ప్రధాని చేసి ఈ స్తానాన్ని బహుమతిగా ఇవ్వాలని కమల దళం ప్రచారం ముమ్మరం చేసింది.
ప్రచారానికి 14 రోజుల గడువు…
ఈనెల 25 వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిచ్చిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షేత్కార్, బిజెపి నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ లు పోరులో ఉన్నారు. ప్రచారానికి మరో 14 రోజుల గడువు ఉండడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నిర్దేశించుకున్న హామీలు పార్టీ మేనిఫెస్టోను ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలుచు కునేందుకు రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో తమ విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ , భాజపా, బీఆర్ఎస్ చెందిన అగ్రనేతలు త్వరలోనే ఎన్నికల ప్రచారానికి జహీరాబాద్ కు రానున్నట్లు సమాచారం. దీంతో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కు తున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, బిఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన అగ్రనేతలు వీరి విజయం కోసం ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
రోజురోజుకు ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నప్పటికీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, తాజా మాజీ సర్పంచులు, సొసైటీ ఛైర్మన్లు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. దింతో బీఆర్ఎస్ కు రోజురోజుకు గ్రాఫ్ తగ్గుతుంది.
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నిల ప్రచారంలో జహీరాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో వలసలతో క్యూ కట్టారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ లో భంగపాటు పడి బీజేపీలో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 27000 వేల ఓట్లు సాధించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి యు టర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి, తాడ్వాయి ఎంపీపీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగిరెలా వ్యూహం
ఈసారి జహీరాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేసి ప్రధాని మోడీకి కానుక ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం బీజేపీ ప్రత్యేక వ్యూహలను రచించుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ చేపట్టబోయే సంక్షేమ పథకాలు ఇంటికి తిరిగి ప్రచారం చేస్తూ బీబీ పాటిల్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలుపులో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. జహీరాబాద్ కా బాద్ షా కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే….
బీబీ.పాటిల్ ను వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోం…కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బిజేపి గెలుపును ఆపలేరు…- బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 26:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
బిజెపి ఎంపి అభ్యర్థి బిబి పాటిల్ ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా దూషిస్తే బిజేపి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని బిజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడుతూ, బిజేపి ఎంపి అభ్యర్థి పై పార్టీ పరంగా విమర్శలు చెయ్యి…అంతే గాని వ్యక్తిగత దూషణల జోలికి వెళితే దాని పర్యవసనాలు వేరే లాగా ఉంటాయని హెచ్చరించారు. పదేళ్లు ఎంపిగా బిబి పాటిల్ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని, బిబి పాటిల్ చేసిన అభివృద్ది పై తాము చర్చకు సిద్దం అని సవాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ తన 5 ఏళ్ల పదవి కాలంలో పార్లమెంట్ లో ఎన్ని సార్లు మాట్లాడారో తమ వద్ద రికార్డులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా బిజేపి గెలుపును ఆపలేరని అన్నారు. ఆ తర్వాత బిజేపి మండల అధ్యక్షుడు నర్శింలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బిజెపి గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు. ఎల్లారెడ్డిలో బీబీ పాటిల్ గెలవకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీతోనే పోటీ అని అన్నారు . పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ది చెప్పి, భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ గడ్డపై కాషాయపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు భయబ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని అన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా, దైర్యంగా పని చేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఎల్లారెడ్డి, మండలంలో లీడ్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నెరెల్ల ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద శంకరంపేట్ సీఎం బహిరంగ సభలో వేదికపై సీఎం పక్కనే కూర్చున్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే
హైదరాబాద్, ఏప్రిల్ 26(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో):-జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని పెద్ద శంకరంపేట్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సీఎం రేవంత్ రెడ్డి భారీ సభలో వేదికపై ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని వున్నారు. మరో పక్క మంత్రి దామోదర రాజనర్సింహ వున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వాగత సమయంలో పక్కనే వున్నారు. సభలో వేదిక పై తకంటూ ఎల్లారెడ్డి ఎమ్యెల్యే ప్రత్యేకతను చాటుకున్నారు.