ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 3వ వార్డులో ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజార్ ఖాద్రి మాజీ కో- ఆప్షన్ రఫీక్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టో ను ఓటర్లకు వినిపిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తుకారం, ముమైత్, తబ్రేజ్ , జమీల్, రాహుల్, ఆదిల్, ఆసిఫ్, అదీప్ కార్యకర్తలు పాల్గొన్నారు.
V.Rajendernath
ఎల్లారెడ్డి, మే 7, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన, మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన కథనం ప్రకారం వివరాల ఇలా ఉన్నాయి. బిక్కనూర్ గ్రామానికి చెందిన బేస్త కృష్ణ ( 20) అనే యువకుడు జీవితం పై విరక్తి చెంది మనస్థాపానికి గురై మండలంలోని మల్లయాపల్లి గ్రామ శివారులోని పోచారం కాలువ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి కి గల కారణాలు ఆరాతీశారు. మృతుడి పెద్ద నాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి , శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బొజ్జ మహేశ్ వివరించారు.
ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నవీద్
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే దేశాభివృద్ధి సాధ్యమవుతోందని ఎల్లారెడ్డి న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్ )అధ్యక్షులు న్యాయవాది నవీద్ అన్నారు. మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి పరిధిలో ఉపాధి హామీ పనుల వద్దకు తన అనుచరులు, పార్టీ నాయకులతో వెళ్లి ప్రచారం నిర్వహించారు. జహీరాధాతఙషుడుబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ మ్యానిపేస్టోను కూలీలకు వివరించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నస్యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)నాగిరెడ్డిపేట్ మండలం జప్తిజాన్కంపల్లికి చెందిన బి. రాములు (70) అనే ఉపాధి హామీకూలి గుండెపోటుతో మృతి చెందాడు. భూమని రాములు శనివారం ఉదయం జప్తి జానకంపల్లి గ్రామ శివారులోని మల్లార్ చెరువులో ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఉపాధి హామీ పనులు ప్రారంభించడానికి ముందే రాములుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునడికి భార్య సాయవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ
ఎల్లారెడ్డి, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ కలియుగ దైవం అయిన అయ్యప్ప ఆలయంలో మళ్ళీ దొంగలు పడ్డారు. శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి గర్భగుడిలో దొంగ ప్రవేశించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పద్మ శ్రీకాంత్ , ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటలకు పూజారి శ్రీనివాస్ రావు ఆలయానికి వచ్చి గర్భ గుడి తాళం పగుల కొట్టి వుండాటాన్ని చూసి వెంటనే ఆలయ కమిటీ ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే కమిటీ ప్రతినిధులు పోలీసులను పిలిపించి సీసీ పుటేజిలను పరిశీలించగా ఆలయ గర్భగుడి తాళాలు పగుల గొట్టి లోనికి వెళ్లిన దొంగ చిత్రం క్లియర్ గా పోలీసులకు చిక్కింది. ఆ చిత్రాన్ని చూసిన పోలీసులు మధ్యాహ్నం వరకు దొంగను పట్టుకొని తీరుతామన్నారు. ఇప్పటికే ఆలయంలో మూడు సార్లు దొంగతనం జరిగింది. దొంగ ప్రతి సారి హుండీ పగుల గొట్టి డబ్బులు తీసుకొని పోతుండటంతో ఆలయ కమిటీ హుండీని తీయించి వేసింది. అంతే కాకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో దొంగ చిత్రం బయట పడింది. దొంగ పెట్టుబడి అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు దొంగతనం జరగడంతో ఆలయ గర్భ గుడిలో స్వామి విలువైన నగలు పెట్టడం లేదు. దొంగకు గర్భగుడిలో ఎం దొరక్క పోవడంతో ఉదయం పూజకు ఉంచిన పండ్ల బుట్టను ఎత్తు కెళ్లినట్లు గుర్తించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడిలోకి ఆలయ పూజారి తప్ప ఎవరికి కూడా ప్రవేశించే అర్హత ఉండదు. దొంగ గర్భగుడి లోపలికి ప్రవేశించడంతో ఆలయ పూజారీ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనే భక్తుల భారీ విరాళాలతో దాదాపు 4కోట్లకు పైగా వెచ్చించి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కేరళలోని శబరిమల ఆలయాన్ని పోలి గుడి కుంటల స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కామారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పాటుతో మొదటి కలెక్టర్ గా వచ్చిన కలెక్టర్ డాక్టర్.సత్యనారాయణ ఈ ఆలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఆలయ నిర్మాణం పూర్తిగా పరిశీలించి ఆలయ నిర్మాణం తీరు పట్ల అభినందించిన విషయం గమనార్హం. అయ్యప్ప ఆలయం ఎదురుగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. సెలవులు కావడంతో విద్యాలయం కూడా మూసి ఉండటం వల్ల, దొంగ ఆలయ గర్భగుడి పెద్ద తాళాలు పగుల గొట్టిన శబ్దం ఎవరికి వినబడదు. రాత్రి పూట ఆలయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని భక్తులు పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసు నమోదు చేశాం…దొంగను పట్టుకుంటాం. నైట్ పెట్రోలింగ్ పెంచుతాం…
సీఐ. రవిందర్ నాయక్
ఎల్లారెడ్డి సీఐ. రవీంద్రనాయక్ మాట్లాడుతూ…అయ్యప్ప ఆలయంలో జరిగిన దొంగతనం పై కేసు నమోదు చేశామని దొంగను పట్టుకుంటామని, అలాగే ఆలయం వద్ద రాత్రి పెట్రోలింగ్ పెంచుతామన్నారు.
మేడ్చల్, మే 2,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):మేడ్చల్ పరిధిలోని కొంపల్లి శాఖ -1 శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరములో 10వ తరగతిలో అత్యధిక 10/10 జీపీఎస్ మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచి విజయ దుందుభి మోగించారని , ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు ఆఫ్ సెకండరీ వారు మంగళవారం విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో, తమ పాఠశాల నుంచి 21 మంది 10/10 జీపీఎస్, 35 మంది 9.8/10 జీపిఎస్ మార్కులు సాధించి పాఠశాలకు, తల్లి దండ్రులకు మంచి పేరు తెచ్చారన్నారు. హాజరైన విద్యార్తులలో 60 శాతం మంది పైన 9 ఆపైన జిపిఎస్ మార్కులు సాధించడం గర్వకారణం అని పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎ.జి.యం. జి.వి. రమణా రావు విద్యార్థులను, తల్లి దండ్రులను, ఉపాద్యాయ బృందం ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి, కో ఆర్డినేటర్ శ్రీ జైపాల్ రెడ్డి, డీన్స్ సోమేశ్వర్ రావు , శ్రీ అఖిల్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డు లో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం గురువారం కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను గెలిపిస్తే ఎల్లారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని గడపగడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తుందని ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు . ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , చెన్న లక్ష్మణ్, షేకావతలి, గఫర్, వినోద్ గౌడ్, నాగం సాయిబాబా, సొసైటీ డైరెక్టర్ గోపికృష్ణ, శంకర్ 11వ వార్డు ఇంచార్జ్ కిషన్, బాలయ్య, రాములు, సాయిలు, కాశీరాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)కామారెడ్డి జిల్లా
ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హైస్కూల్ లో చదువుతూ, మంగళవారం విడుదలైన టెన్త్ పరీక్ష ఫలితాల్లో 10/10 సాధించిన పి.స్పందనను బుధవారం ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలోఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు శాలువా కప్పి సత్కరించి అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ విశాల్ జనసభ విజయవంతం….జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన- జహీరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్
ఎల్లారెడ్డి, మే 1,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ప్రధాని నరేంద్ర మోడీ విశాల్ జన సభను విజయవంతం చేసిన, జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు , బిజేపి ఎంపి అభ్యర్థి బిబి పాటిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా టెక్మాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లా డుతూ…ఐ బి చౌరస్తా అల్లాదుర్గ్ లో మంగళవారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ విశాల్ జనసభ విజయవంతం అయ్యిందని, సభ విజయవంతంకు కృషి చేసిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు పేరుపేరున ప్రతి ఒక్కరికీ హ్రృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బిబి పాటిల్ మాట్లాడుతూ…మోడీ విశాల్ జన సభతో జహీరాబాద్ లో బిజెపి గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మోడీ గంటన్నర మాట్లాడారంటే ఆయనకు ఇక్కడి ప్రజలపై ఉన్న ప్రేమ ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. మోడీ ఉపన్యాసం వినడానికి ప్రజలు స్వచ్ఛందంగా తండోప తండాలుగా కదిలి వచ్చారని తెలిపారు. నరేంద్రమోడీ అన్ని అంశాలను కూలంకుషంగా చెప్పారని, ప్రతి పక్షాలు రాజ్యాంగం, రిజర్వేషన్లకు సంబంధించి చేస్తున్న దుష్ప్రచారాలను మోడీ తిప్పికొట్టారని వివరించారు. రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ లు ఏమి అభివృద్ధి చేశారని బిబి పాటిల్ ప్రశ్నించారు. లింగాయత్, ఓబిసీ, ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రధాని మాట ఇచ్చారని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంకు జాతీయ రహదారులు, కేంద్రీయ విద్యాలయం, రైల్వే లైన్ తదితర అన్ని రంగాల్లో మోడీ సహకారంతో అభివృద్ధి చేశామని చెప్పారు. నిమ్జ్ అభివృద్ధి కోసం క్రృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు అని తెలిపారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ బిజేపి ఎంపి అభ్యర్థి బిబి పాటిల్ తో పాటు సంగారెడ్డి జిల్లా బిజేపి అద్యక్షులు గోదావరి అంజిరెడ్డి, బిజేపి నాయకులు మురళీ తదితరులు ఉన్నారు.
5 శాతం రిబెటు తో మున్సిపాలిటీకి 34 లక్షల25 వేల ఆదాయం …ముగిసిన రిబేటు సౌకర్యం….- ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు
ఎల్లారెడ్డి, మే 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులు 5 శాతం రిబెటుతో చెల్లించిన ఆస్థి పన్నులతో, మున్సిపాలిటీకి 34 లక్షల 25 వేల రూపాయల ఆదాయం వచ్చిందని , స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. బుధవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, 2024- 25 ఆర్థిక సంవత్స రానికి గాను, ఏప్రిల్ 1వ తేది నుంచి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో ప్రారంభమైన 100కు 5 శాతం ఆస్తి పన్ను రిబెటు వసూళ్ల స్పెషల్ డ్రైవ్ కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అన్ని వార్డుల్లో ఆయా వార్డు అధికారులు సిబ్బంది ఇంటింటికీ, వ్యాపార సంస్థల వద్దకు, దుఖాన యజమానుల వద్దకు తిరుగుతూ 5 శాతం రిబేటు సౌకర్యం గురించి వివరిస్తూ, ఇంటి యజమానుల నుంచి ఆస్థి పన్నులను ఏప్రిల్ 30 లోగా చెల్లించి, మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఆస్థి పన్నులను వసూలు చేయడం జరిగిందన్నారు. 30వ తేది మంగళవారంతో 5 శాతం రిబేట్ ఆస్థీ పన్ను వసూళ్ల స్పెషల్ డ్రైవ్ ముగిసిందని కమిషనర్ తెలిపారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మాసం రిబెటు ఆస్థి పన్నుల ఆదాయం దాదాపు గా 23 లక్షలు వచ్చిందని, 2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను 34 లక్షల 25 వేల రూపాయల ఆదాయం వచ్చిందని కమిషనర్ వివరించారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ పరిధిలోని ఇంటి యజమానులు ఏప్రిల్ మాసంలో కల్పించే 5 శాతం రిబేటు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.