మహబూబాబాద్, జూన్ 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో అధికారులు, సబ్ స్టేషన్ ఆపరేటర్ ల నిర్లక్ష్యం వలన విచ్చలవిడిగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని అక్కడి సబ్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ఎపుడు వచ్చి ఎపుడు పోతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సబ్ స్టేషన్ ఆపరేటర్ లను సంప్రదించడానికి గత 5 నెలల నుండి కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయిందన్నారు. విద్యుత్ కోత వల్ల త్రాగు నీటికి తీవ్ర సమస్య తల్లేతుందని త్రి ఫేస్ సరిగా ఉండకపోవడంతో కిలో మీటర్ దూరం నుంచి రెండు కిలో మీటర్ ల దూరం వెళ్లి త్రాగు నీటి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
V.Rajendernath
పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్కు తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్ల వినతి
హైదరాబాద్, జూన్ 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఎలక్ట్రానిక్ మీడియా పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ త్వరితంగా జరిగెల చూడాలని
తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఘోరీ నేతృత్వంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన అధ్యక్షుడు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
ఉర్దూ పత్రికలు, పాత్రికేయుల బృందం ఖలీల్ అహ్మద్, ముహమ్మద్ అసద్ అలీ, ముహమ్మద్ అలీ హష్మత్ జహూరీలు తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ సూపరింటెండెంట్ వి.కృష్ణ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ అమెరికా పర్యటనలో వాషింగ్టన్ లో భాగంగా సియటల్ జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరై నియోజకవర్గంలో అభివృద్ధికి పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేయాలని వారిని కోరారు. ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతంగా ముగుంచుకొని తిరిగి స్వదేశాగమనం కి రావటంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు నాగం సాయిబాబా , షేకవత్ అలీ, గఫర్, తదితరులు పాల్గొన్నారు..
జర్నలిస్ట్ ల రైల్వే పాస్ ల కోసం కేంద్రానికి నివేదిస్తాం …ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్
హైదరాబాద్, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)దేశంలో జర్నలిస్ట్ రైల్వే పాస్ లు కోసం కేంద్రానికి నివేదిస్తాం అని
ఎన్ యు జె(ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ముస్కాన్ ఫంక్షన్ హాల్ లో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఇండియా) కార్యదర్శి మాట్లాడుతూ..గత 3ఏళ్ల కాలంగా జర్నలిస్ట్ రైల్వే పాస్ లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసారని, మళ్ళీ ఈ పాస్ ల పునరుద్ధరణకు ప్రయత్నిస్తా మన్నారు. రాష్ట్రంలో టీజేఏ సభ్యులు సభ్యత్వ రుసుము 100రూపాయలు విధిగా చెల్లించాలని కోరారు. టీజేఏ జర్నలిస్టులకు యూనియన్ గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. టీజేఏ తరపున మహాత్మ గాంధీ హౌసింగ్ సొసైటీ సమావేశం జరుపుకోవడం శుభారంభం అన్నారు. జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర, జిల్లా కమిటీలు ఎప్పటికప్పుడు స్పందించాలని కోరారు.
యూనియన్ నడపడానికి నిధుల సేకరణ అవసరం అని, దీనికోసం జర్నలిస్ట్ సమాచార్ మాసపత్రిక ప్రారంభిస్తున్నాం అని ఎన్ యు జె మాజీ చైర్మన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, టీజేఏ, జాప్ ఫౌండర్ అయిన ఉప్పల లక్ష్మణ్ అన్నారు. జర్నలిస్ట్ సమాచార మాస పత్రిక కు ప్రకటనల సేకరణ బాధ్యత ప్రతి జిల్లా యూనిట్ తీసుకోవాలన్నారు. టీజేఏ యూనియన్ కి సంబంధించిన వార్తలు, స్టోరీలు ఈ పత్రికకు ఇవ్వ వచ్చన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లోని టీజేఏ రాష్ట్ర కార్యాలయాన్ని ఆధునికరించడం, రాష్ట్ర కార్యవర్గం తరచు కార్యాలయానికి రావాలని, ప్రతి నెల విధిగా సమావేశం నిర్వహించి, జర్నలిస్ట్ సమస్యలు, ఇతరత్రా జర్నలిస్ట్ సంబంధమైన చర్చలు జరిపి, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు తయారు ప్రభుత్వానికి సమర్పించే నివేదికలు, వినతి పత్రాలు అందిస్తుండాలన్నారు. సభ్యత్వ రుసుము ప్రతి టీజేఏ సభ్యులు విధిగా చెల్లించి, తమ బాధ్యతలు నిర్వహించాలన్నారు. మహాత్మగాంధీ జర్నలిస్ట్ సొసైటీ ద్వారా టీజేఏ సభ్యులైన జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. అనంతరం టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు మాట్లాడుతూ..జర్నలిస్ట్ లకు కొత్త అక్రిడిటేషన్స్ వచ్చే వరకు పాత అక్రిడిటషన్ కార్డులు రినివల్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 30తో అక్రిడిటేషన్ లు, జర్నలిస్ట్ బస్ పాస్ ల గడువు ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉర్దూ భాషసంఘం సభ్యులుగా ఎన్నికైన సత్తార్ ను టీజేఏ సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్ యు జె(ఐ)కార్యవర్గ సభ్యులు డాక్టర్. షేక్ హసీనా, దన్నారపు రాజలింగం, టీజేఏ ప్రతినిధులు మోహన్ యాదవ్, ఖాసీం, ఖాళీల్ అహ్మద్, మొహమ్మద్ గౌరీ, సంపత్ కుమార్, కుమార స్వామి, ముఖిమోద్దీన్, ఆరిఫ్ ఖాన్, యాదిల్, యాదగిరితో పాటు 200మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )పాత్రికేయ వృత్తిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ఘనత ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుదేనని ఎన్ యు జె(ఐ)కార్యదర్శి రాజేందర్ నాథ్ అన్నారు. ఆదివారం రామోజీ మృతి పట్ల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ సంతాపసభ ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభకు హాజరైన రాజేందర్ నాథ్ తో పాటు తో తోటి జర్నలిస్టులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఎన్ యూ జె(ఐ)కార్యదర్శి మాట్లాడుతూ..రామోజీమృతి పిస్టుల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేశారు. ఈనాడు పత్రిక రాక ముందు పాత్రికేయ వృత్తి పట్టణాలకు, జిల్లా కేంజ్రాలకే పరిమితం అయ్యేది, రామోజీ రావు స్థాపించిన ఈనాడు పత్రికలో జిల్లా అనుబంధం తీసి, నియోజక వర్గ, మండల స్థాయి పాత్రికేయులు ఏర్పాటు చేసి, జర్నలిజం వృత్తిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారని, తరువాత అన్నీప్ పత్రికలు మండల స్థాయిలో రిపోర్టర్ లను పెట్టారన్నారు. ప్రతిభకు గుర్తింపు నిచ్చి, జర్నలిజంతో ఎన్నో ప్రజా సమస్యలకు చెక్ పెట్టారన్నారు. ప్రతి జర్నలిస్ట్ రామోజీ అడుగు జాడల్లో నడవాలన్నారు. ఈ సంతాప సభలో జిల్లా అక్రిడి టేషన్ కమిటీ గ్రామీణ ప్రాంత సభ్యుడు సోమయాజుల రాజ్ కుమార్ , సీనియర్ జర్నలిస్టు న్యాయవాది పద్మ పండరీ, సీనియర్ జర్నలిస్టులు శివ, సిద్దుగౌడ్, తుప్తేవర్ శివకుమార్, శ్రీనివాస్ రావు, మహేష్, ముత్తి రాములు, ప్రశాంత్ గౌడ్, పృథ్వి రాజ్, అమృత్ రావు, సంతోష్, పట్టేం ప్రసాద్, సంతోష్, ఆకుల వెంకట్, లక్మి నారాయణ, ఎలక్ట్రానిక్స్, అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు శుక్రవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను స్టార్ హాస్పిటల్ కు తరలించి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స పొందుతూ, శనివారం తెల్లవారు జామున కన్ను మూశారు. . కాగా ఇటివలే రామోజీ రావు గుండెకు స్టంట్ వేయడం గమనార్హం.
అక్షర శిల్పి రామోజీ కి ఘన నివాళి
చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
కుటుంబ నేపథ్యం ఇదీ
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.
బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 – 1961)
ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుచేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును సృష్టించుకుని, తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో ఆరవ ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల బాలకిషన్ కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలకిషన్ మిత్రులైన బీఆర్ఎస్ నాయకుడు మాజీ పాత్రికేయుడు నుండిగొండ శ్రీనివాస్, వ్యాపారి మాశెట్టి శ్రీనివాస్ లు కలుసుకొని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల బాలకిషన్ కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలకిషన్ మిత్రులైన జాతీయ జర్నలిస్ట్ సంఘం (ఎన్ యు జె(ఐ ) కార్యదర్శి వి.రాజేందర్ నాథ్, నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, ప్రముఖ వ్యాపారులు రాజులు, ఎర్ర శ్రీనివాస్ లు కలుసుకొని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నేపాల్, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)నేపాల్ దేశంలోని ఖాట్మండు, జ్వాలాఖేల్ లలిత్పూర్ ప్రాంతాలలో మాతృ భాషలో జర్నలిజం – ఆధునిక భాషలో జర్నలిజం శతాబ్ది వేడుకలను సార్క్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వివిధ దేశాల ప్రతినిధులను సమావేశం ఇటీవల జరిగింది.మొట్ట మొదటి నేపాల్ జర్నలిస్టు ధర్మాధిత్య ధర్మాచార్య జ్ఞాపకార్థం
సార్క్ జర్నలిస్ట్ ఫోరం- నేషనల్ ఫోరం ఆఫ్ నెవార్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ జర్నలిస్టుల సమావేశం
మాతృభాషలో జర్నలిజం – ఆధునిక భాషలో జర్నలిజం పై చర్చ
నేపాల్ లో వివిధ దేశాల జర్నలిస్టుల సమావేశం జరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు సీనియర్ జర్నలిస్టు కె.వి. రమణారావు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ అధ్యక్షురాలు మొదటి మహిళా అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి, ఉప ప్రధాని నారాయణ్ కాజి, తిమి మేయర్ సురేంద్ర శ్రేష్ఠ సార్క్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు రాజు లామా, అబ్దుల్ రెహమాన్, అనిరుధ్ సుధాన్షు ,కిన్లీ, తెలుగు భాష పై మాట్లాడటానికి కె.వి.రమణారావు ఉర్దూ భాష విశిష్టతను తెలుపదానికి మహమ్మద్ యూసఫ్ ఖాద్రి, మహమ్మద్ నసీర్ ఖాద్రి, మహమ్మద్ అరిఫ్ లు విచ్చేసిన కార్యక్రమానికి బ్రిపేంద్ర లాల్ శ్రేష్ఠ అధ్యక్షత వహించగా కె.కె. మనందర్ , రాజేష్ భద్రచార్యలు స్వాగతం పలికారు.
సూరజ్బిర్ బజ్రచార్య,నారాయణ్ సుందర్ కిలంబు, పుష్కర్ భక్త మతెమా,సురేష్ కిరన్ మనందర్, కిరన్ శాక్య,రాజు శాక్య,మోహన్ దువాల్,ఈశ్వర్ జోషి,నరేష్ బిట్ శాక్య, బిజయ్ రత్న, అసోన్ బరే,ఉపేశ్ మహార్జన్ తదితర అతిధులు పాల్గొన్నారు. భారత దేశ ప్రతినిధిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కె .వి.రమణారావు సమావేశంలో మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం అంటూ భారతదేశ ఓన్నత్యాన్ని,వివిధ మతాలు ,కులాలు,ఉప కులాలు ఆచార వ్యవహారాలు,భిన్న సంస్కృతుల గురించి వివరిస్తూ భారతీయుల మంతా ఒక్కటే అని ప్రపంచ దేశాలకు చాటారు.
దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగుభాష పై మాట్లాడుతూ తీయనైన ,మధురమైన, సరళమైన తెలుగు భాష గొప్ప తనాన్ని అ అంటే అమ్మ ఆ అంటే అవు అని తెలుగు భాషను పిల్లలకు నేర్పుతారని మాతృ భూమి,మాతృ భాష,అమ్మ ను ఎప్పటికీ మరచిపోరాదు అని హితవు పలికారు, అవు గొప్పదనాన్ని కూడా వివరిస్తూ అంతర్జాతీయ సదస్సులో భారత దేశ కీర్తిని చాటారు. ఈ సమావేశంలో నేపాల్, భారతదేశం, భూటాన్ బంగ్లాదేశ్,పాకిస్తాన్,మాల్దీవ్స్ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేపాల్ దేశంలో
సీనియర్ జర్నలిస్టు రమణా రావును మాజీ నేపాల్ అధ్యక్షురాలు, ఉప ప్రధాని, నగర మేయర్ తదితరులు సన్మానించారు.
పర్యావరణ పరిరక్షణతోనే భావి తరాలకు మనుగడ…- ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక
ఎల్లారెడ్డి, జూన్ 5,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
పర్యావరణ పరిరక్షణతోనే భావి తరాలకు మనుగడ అని , ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక అన్నారు. బుధవారం స్థానిక కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ఆమె స్థానిక కోర్టు బార్ కౌన్సిల్ అద్యక్షులు నవీద్ పర్వేజ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తో కలిసి మొక్కలు నాటి నీళ్ళు పోశారు. ఆతర్వాత జడ్జి గౌండ్ల హారిక మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విధిగా కృషి చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాలని పిలుపు నిచ్చారు. అలాగే పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే, వృక్షాలుగా మారి రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందని అన్నారు. ఇందు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రకృతిని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిఫ్ కోర్టు జడ్జి గౌండ్ల హారిక, కోర్టు సూపరింటెండెంట్ మమత, కోర్టు బార్ కౌన్సిల్ అద్యక్షులు నవీద్ పర్వేజ్ , న్యాయవాదులు సాయి ప్రకాష్ దేశ్ పాండే, గోపాల్ రావు , నామ శ్రీనివాస రావు, సతీష్ కుమార్, పద్మ పండరి, నామ శ్రీకాంత్, నాగం సాయిబాబా, సీనియర్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్, సిబ్బంది రాజ్ మోహన్, ప్రమోద్, రవి గౌడ్, సతీష్, జ్యోతి, కోర్టు కానిస్టేబుల్స్ నిరంజన్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.