యూనియన్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ పిఓ మమతకు వినతి పత్రం
మిర్యాలగూడ డిసెంబర్ 10: (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్నందున అంగన్వాడి కేంద్రాలను మూసి ఉంచుతామని తెలుపుతూ మిర్యాలగూడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమతకు తెలుపుతూ లేఖను యూనియన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, అంగన్వాడి టీచర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బొందు పార్వతి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిసెంబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమానికి టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆలోచననుఉపసంహరించుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, క్రచ్ సెంటర్స్ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, గ్రాట్యూటీ, పిఎఫ్, ఈఎస్ఐ ఇతర సమస్యలను పరిష్కరించాలని, చివరి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినీ టీచర్స్ కు రాష్ట్రంలో 4,000 మంది ఉన్నారని వారిని మెయిన్ టీచర్ గా ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం కానీ నేటికీ హెల్పర్ జీతాలు ఇవ్వడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం ఇచ్చినా ప్రమోషన్ల ప్రకారం మెయిన్ టీచర్ వేతనం ఇవ్వాలని, మినీ సెంటర్లకు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రిటర్మెంట్ బెనిఫిట్ టీచర్ కు రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి జీవోలు ఇవ్వలేదని, ఇప్పటి కి టీచర్లకు లక్ష రూపాయలు హెల్పర్ కు 50,000 ఇవ్వడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలే అమలు కాకపోతే ఎవరిని నమ్మాలని అన్నారు. వనపర్తి జిల్లాలో పది నెలలుగా రూమ్ రెంట్లు సెంటర్ అద్దె లు ఇవ్వలేదని, గ్యాస్ సిలిండర్, కూరగాయల బిల్లు ఇతర బిల్లు పెండింగ్ లో ఉన్నాయని జిల్లా అధికారులు చొరవ చేసి ఇవ్వాల్సిన బిల్లులను పెండింగ్లో పెట్టడం అన్యాయం అన్నారు. టీచర్ పోస్టులుకె ఖాళీగా ఉన్న దగ్గర ఇతర టీచర్లకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన ఇన్చార్జి అలవెన్స్ ఇవ్వకపోవడం సరికాదని అన్నారు . ఇన్చార్జి అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటీయు పట్టణ కార్యదర్శి టీ.రామ్మూర్తి, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు స్వరాజ్యం, పట్టణ అధ్యక్షులు ఇండ్రపల్లి సైదమ్మ, టీ.అరుణ, జి.లక్ష్మి, రజిత, కోమ పాల్గొన్నారు