తెలంగాణ ఎక్స్ ప్రెస్
వెల్గటూర్ పిబ్రవరి 12
ఉమ్మడి వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సంగ శ్రీనివాస్ S/o లింగయ్య గత 26 సంవత్సరాల క్రితం ముత్తునుర్ నుండి కొండాపూర్ కు ఇల్లరికం వెళ్లాడు,ప్రతి రోజు లాగే మంగళవారం రోజున సాయంత్రం 5:30 గంటలకు ఇంటి నుండి గ్రామశివారులో ఉన్న పొలానికి కెనాల్ ద్వారా నీళ్లు పెట్టడానికి తన బైక్ పై వెళ్లాడు తిరిగి రాత్రి 09:30 గంటలకు ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కొండాపూర్ గ్రామశివారులో తొండం ఏరియాలో రోడ్డు పై బైక్ ను అడవి పందుల గుంపు వచ్చి బైకును ఢీకొనడంతో రోడ్డు పై బోర్ల బొక్కల పడగ తలకు, ఇతర చోట్ల రక్త గాయాలు అయ్యి, ముక్కులోనుండి చెవుల్లో నుండి రక్తం కారి అక్కడికక్కడే చనిపోయినాడు మృతుని కొడుకు సంగ విష్షువర్ధన్ ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు. చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమా సాగర్ తెలిపారు