ముధోల్:23ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కరీంనగర్,మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజ కవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ వి ద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఊటుకూ రి నరేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి అన్నా రు. మండల కేంద్రమైన ముధోల్ తోపా టు మండలంలోని ఎడ్ బిడ్ ,వెంకటా పూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నియో జకవర్గ ఇంచార్జీ భోస్లేనారాయణరావు పటేల్ ఆదేశాల మేరకు ఆదివారం ప ట్టభద్రుల ఇంటింటికి వెళ్లి ముమ్మరం గా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు విద్యాసంస్థల పనిచేస్తు న్న ఉపాధ్యాయులకు జీవిత భీమాను అందజేస్తుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈనెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిని గెలిపిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల శ్రీనివాస్ ప్రసాద్ తదితరులున్నారు.