ముధోల్:29జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఇటీవల మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ముత్కేడ్ లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌవాన్ చేతుల మీదుగా శాసకీయ సమాజ్ భూషణ్ పురస్కారాన్ని గడ్డం సుభాష్ అందుకున్నారు. దీంతో బుధవారం బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన నివాసంలో గడ్డం సుభాష్ ను శాలువాతో ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవసేవే.. మాధవ సేవగా ఆపదలో ఉన్న వారిని ఆదుకో వడం అభినందనీయమన్నారు.నియోజకవర్గ ప్రజలకే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా సుభాష్ సమాజసేవలు చేయడం పట్ల మహా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ పురస్కారాన్ని అందించిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలను చేయాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరికి సేవ గుణం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, మాజీ పీఎ సీఎస్ చైర్మన్ మాధవరావు పటేల్, నా యకులు తాటివార్ రమేష్, మల్లేష్ తోపాటు తదితరులున్నారు.
