Home తాజా వార్తలు భవన నిర్మాణ కార్మికులకు రక్త పరీక్షలు…

భవన నిర్మాణ కార్మికులకు రక్త పరీక్షలు…

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్కారెడ్డి పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులకు, ఆదివారం స్థానిక బిందర్లో రక్త పరీక్షలు నిర్వహించారు. భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మిక శాఖ ఆధ్వర్యంలో, హైద్రాబాద్ నుంచి వచ్చిన ఆరోగ్యశాఖ సి ఎస్ సి (కామన్ సర్వీస్ సెంటర్) వాళ్లు భవన నిర్మాణ కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. కార్మిక నాయకులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వం మరియు కార్మిక శాఖ అందిస్తున్న సేవలను కార్మికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి కార్మికుడు లేబర్ కార్డు చేయించుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే నాయకులకు తెలపాలని సూచించారు. కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి హెల్త్ క్యాంప్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ సాయన్న, ఎల్లారెడ్డి మండల కార్మిక నాయకులు జిల్లా కోశాధికారి ధ్యానబోయిన శ్యామ్ మేస్త్రి, బెల్దర్ తూకారాం, సంగమేశ్వర్ మేస్త్రి, గణేష్ మేస్త్రి, అబ్దుల్ రజాక్, జిల్లా ప్రచార కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment