Home జాబ్స్ వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై మోహన్ రెడ్డి…..

వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై మోహన్ రెడ్డి…..

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 24:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా
బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి టూ వీలర్ వెహికల్ కు నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని అన్నారు లేని ఎడల బండ్లను సిజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో. ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ పాండు, హోంగార్డు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment