Home తాజా వార్తలు టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం హేయమైన చర్య!

టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం హేయమైన చర్య!

by Telangana Express

తక్షణమే మంచు మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

-బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్

తక్షణమే మంచు మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

-బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్

మిర్యాలగూడ డివిజన్ తెలంగాణ ఎక్స్స్ ప్రెస్ డిసెంబర్ 11: గత రాత్రి టీవీ9 ప్రతినిధిపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం హేయమైన చర్య అని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సినీనటుడు తన కుటుంబంలో జరుగుతున్న కలహాల నేపథ్యంలో తన ప్రతిష్టను స్థాయిని మరిచి వివరణ కోరిన టీవీ9 ప్రతినిధిపై తీవ్రంగా దాడి చేసి గాయపరచడం అతని దురహంకారానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ టీవీ9 ప్రతినిధికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిర్భయంగా వెలికితీసి ప్రజలకు చేరవేసే జర్నలిస్టులపై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం మంచు మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, కౌకూరి వీరాచారి, జిల్లేపల్లి సాయి, కిషోర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment