Home తెలంగాణ ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి.

ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బైకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి.

by Telangana Express

జోగిపేట్ డిసెంబర్ 05:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గం లో జోగిపేట మున్సిపాలిటీ లోని బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్, ప్రభాకర్ గౌడ్, వివిధ మండల అధ్యక్షులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి సంవత్సరమైనా ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని రైతు పండుగ పేరు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచినందుకా ఈ సంబరాలు చేసుకుంటున్నారు అని వారు అన్నారు, రైతులకు ఇస్తామన్నా పదిహేను వేల రూపాయలు ఏమైందని వారు అన్నారు, రైతులకు పంట బోనస్ పేరుతో కనీసం వడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు, ఆందోల్ నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే పేరు గొప్ప ఊరు ఊరు దిబ్బ అన్న చండాలంగా ఇక్కడ నుండి మంత్రిగా ప్రతినిత్యం వహిస్తున్న దామోదర్ రాజనర్సింహ గారు ఇక్కడ ప్రజలను పట్టించుకునే పరిస్థితు లో లేరని విషయం సుస్పటంగా కనిపిస్తుంది, ఇక్కడ సింగూర్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు సాగునీరు అందించలేని ఈ మంత్రి గారు ఇక్కడ రైతులను మోసం చేసిన మొదటి వ్యక్తి అని అన్నారు, సభా వేదిక వద్దకు వృద్ధురాలు విచ్చేసి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాం అని చెప్పి ఉన్న రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలకు ఒకసారి ఇస్తూ ఒక్క నెల రోజుల పెన్షన్ వారే తీసుకుంటున్నారు అని వాపోయారు, ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదని ఉచిత బస్సు వల్ల మా ఆటోలకు ఆదరణ లేక ఫైనాన్స్ వాళ్ళు మా ఆటోలు తీసుకొని పోతున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు కౌన్సిలర్లు మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment