చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు
ఆరు గ్యారంటీలను అమలుచేయడం ఖాయం: సతీష్ రెడ్డి
కూకట్ పల్లి,జోన్(నజీర్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)
ప్రజా పాలనే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఈ ప్రభుత్వం కేవలం పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో మూడు కోట్ల 54 లక్షల షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక శాసన సభ్యులు మాధవరం కృష్ణారావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై ప్రజలు ఆశతో ఉంటారని ప్రజల ఆశలను వమ్ము చేయకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని అలా ఎవరైనా భావిస్తే వారి భ్రమే అవుతుందన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, భవిష్యత్తులో సైతం ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో…కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, శిరీష, సబిహా, కూకట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, వేణు, సంజీవరావు వెంకటేశ్వరరావు, తమ్మినేని ప్రవీణ్ కుమార్ కృష్ణ రాజ్ పుత్, సతీష్ గౌడ్, మహమ్మద్, మేకల రమేష్, మధు గౌడ్, లక్ష్మినారాయణ, మస్తాన్ రెడ్డి, కనకయ్య ముదిరాజ్, అక్బర్, శివ చౌదరి, నలినికాంత్ పాల్గొన్నారు.