ముధోల్: 02నవంబర్(తెలం గాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీ పావళి కానుకలో భాగంగా డై ట్,కాస్మటిక్ చార్జీల పెంపుపై తె లంగాణ గిరిజన గురుకుల పా ఠశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసారు. ఆర్సివో ఆగ స్టీన్ ఆదేశాల మేరకు ప్రిన్సిపా ల్ శిరీషా ఆధ్వర్యంలో చార్జీల పెంపుపై తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం లకు ధన్యవాదాలు తెలు పుతూ ఫ్లకార్డులను ప్రదర్శించా రు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శిరీష మాట్లాడుతూ .. 3 నుం డి 7వ తరగతి విద్యార్థులకు ప్ర తి నెల 950 బదులుగా 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 కి,ఇంటర్ విద్యా ర్థులకు 1500 నుండి 2100 రూపాయలకు డైట్,కాస్మటిక్ చార్జీలు 40 శాతం పెంచడం సంతోషం కలుగుతుందని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.