Home తాజా వార్తలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏమ్ ఆర్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏమ్ ఆర్ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 26/10/24
భైంసా మండలము కేంద్రం లోని
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్  ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
ప్రభుత్వం మారితే పాత బకాయిలు తీర్చరా
_రాష్ర్ట ముఖ్యమంత్రి స్పందించాలి_
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చందపురే  దిగంబర్
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్ మాట్లాడుతూ,
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పుడు వరకు కూడా విద్యారంగంపై కనీసం సమీక్ష చేయకుండా రాష్ట్ర మంత్రి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాది, అదేవిధంగా అన్ని శాఖలు కేటాయించిన విద్యాశాఖకు మాత్రం ఎందుకు మంత్రిని కేటాయించలేదని ప్రశ్నించారు విద్య రంగ సమస్యలు పరిష్కరించాలి  తెలంగాణ రాష్ట్రములో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబేర్స్మెంట్ స్కాలర్షిప్  2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేరుకోని ఉన్నాయి. 2019- 2020 – 800 కోట్లు, 2020-2021 -2356 కోట్లు,2021-2022 – 2100.43 కోట్లు, 2022-2023 – 2958.14 కోట్లు మొత్తం 8214.57 కోట్లు రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి.ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్ధులకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు వెళ్ళాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టీఫీకెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చి నడుపుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతవేసే పరిస్థితి ఉందని వాపోతున్నారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలి మరియు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పెరిగిన ధరలకు 3500 చార్జీలు పెంచాలి ,అద్దె భవనంలో ఉన్న గురుకులాలు హాస్టల్లో సొంత భవనాలు నిర్మించాలి, ఎస్ సి,బిసి,ఎస్ టీ, నూతన కళాశా హాస్టల్స్ ఏర్పాటు చేయాలి,గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన సమయానికి బస్ నడపలి, ఖాలుగా ఉన్న టీచర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వర్షిత్ జస్వంత్ మనోజ్ విఠల్ అరుణ్ పవార్ బబ్లు మణికంఠ విష్ణు విష్ణువర్ధన్ శివాజీ గణేష్ లక్షమన్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment