66
ఎల్లారెడ్డి, మే 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల బాలకిషన్ కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలకిషన్ మిత్రులైన బీఆర్ఎస్ నాయకుడు మాజీ పాత్రికేయుడు నుండిగొండ శ్రీనివాస్, వ్యాపారి మాశెట్టి శ్రీనివాస్ లు కలుసుకొని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.