Home తాజా వార్తలు ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు ఓటర్ స్లిప్పుల పంపిణీజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు ఓటర్ స్లిప్పుల పంపిణీజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

by V.Rajendernath

కామారెడ్డి: ఏప్రిల్ 24 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు జిల్లాలోని ఓటర్లకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటు వేసేందుకు ఓటర్లు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు వంటి వాటిలో ఒక దానిని తప్పనిసరిగా తీసుక వెళ్లే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, సభలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు మూడు నియోజకవర్గాల్లో 6007 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లో1815, ఎల్లారెడ్డిలో 1798, కామారెడ్డిలో2394 మంది యువతీ, యువకులు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 18 నుంచి 19 ఏళ్ల యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, కాశీంఅలీ, నరేందర్, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment