హైదరాబాద్, ఏప్రిల్ 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మాజీ మంత్రి హరీష్ రావు పదేళ్లు రాష్ట్ర మంత్రిగా ఉండి రైతులకు చేసింది ఏముందని మాజీ మంత్రి హరీష్ రావుపై
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎంపీ ఎన్నికలలో భాగంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ ర్యాలీ అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు మాట్లాడుతూ..మాజీ మంత్రి హరీష్ రావు సై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చూసి ఓర్వలేక ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకొక్కటిగా నెరవేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ స్థానికూడని, బీజేపీ అభ్యర్థి బీబీ.పాటిల్ బిజినెస్ పాటిల్ అని అన్నారు. అవసరాన్ని బట్టి కారెక్కి 10ఏళ్ళు ఎంపీ గా పదవీని అనుభవించి , కారు దిగి బీజేపీలో చేరడాన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిగా గెలిస్తే, తను, ఎంపీ కలిసి జహీరాబాద్ నియోజక వర్గం అంత అభివృద్ధి చేయోచ్చు అన్నారు. మీడియాతో మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన వారిలో జహీరాబాద్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ , బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
హరీష్ రావు పదేళ్లు మంత్రిగా ఉండి రైతులకు చేసింది ఏముందిమాజీ మంత్రి హరీష్ రావుపైఎల్లారెడ్డి ఎమ్యెల్యే ఆగ్రహం
44
previous post