బోనకల్, ఏప్రిల్ 15:- (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ): డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా చింతపల్లి మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన జై భీమ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బోనకల్ మండల కేంద్రంలో గల శాంతి నిలయంలో మానసిక బాలికల అంగవైకల్యం గల విద్యార్థులుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ… అంబేద్కర్ జయంతి సందర్బంగా అన్నదాన కార్యక్రమం చేయడం,వారితో కలిసి భోజనం చేయడం మనసుకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. అటు విద్యార్థుల పర్యవేక్షకురాలైన సిస్టర్ అల్ఫీ మేడం ను యూత్ సభ్యులు మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు రాబోయే కాలంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ అధ్యక్షులు రమేష్, శాంతి నిలయం నిర్వాహకురాలు సిస్టర్ అల్ఫీ, యూత్ కార్యదర్శి, ట్రెజరర్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
శాంతి నిలయంలో అన్నప్రసాద వితరణ
61
previous post