42
పిట్లం,ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) మండల పరిధిలోని గద్దగుండు తాండకు చెందిన తాండవాసులు సోమవారం బిజెపి ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరినట్లు మండల అధ్యక్షుడు అభినయ్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ..దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో మరొక మారు 400పై ఎంపీ స్థానాలతో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని,బీసీ,ఎస్సీ,ఎస్టీలకు బీజేపీ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని,గిరిజన మహిళను భారతదేశ రాష్ట్రపతిగా గొప్ప అగ్రస్థానంలో నిలుపడం కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన పౌరదేవి ఆలయ అభివృద్ధికి క్రృషి చేసి ఆత్మ గౌరవం నిలబెట్టేల రాబోయే కాలంలో అందరికీ సమాన న్యాయం బీజేపీ తోనే సాధ్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాము,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు అశోక్ రాజ్, పట్టణ అధ్యక్షుడు శివ కుమార్,
నాయకులు బెజుగం నర్సింలు,జగదీష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.