Home తాజా వార్తలు మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు

మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు

by Telangana Express

ముధోల్:06ఏప్రిల్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రైతులు పండించిన వరి పంట ధాన్యానికి మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పీఎసీఎస్ సీఈఓ సాయరెడ్డి అన్నారు శనివారం మండలంలోని ఎడ్ బిడ్ ,చింతకుంట,రువ్వి, బ్రహ్మ న్ గావ్,ఆష్ట,విట్టోలి,కారేగామ్ గ్రామాల్లో పీఎసీఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2203, బి గ్రేడ్ రకం వరి ధాన్యానికి రూ.2183 మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ సిబ్బంది నాగభూషన్, రైతులు తదితరులున్నారు.

You may also like

Leave a Comment