ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
50 కోట్ల రూపాయల నిధులు ల్యాప్స్ చేసిన ఘనత జహీరాబాద్ ఎంపి బీబీ.పాటిల్ దే అని, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, జహీరాబాద్ ఎంపీగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థి బీబీ పాటిల్ కాదని, బై బై పాటిల్ అని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు నియోజక వర్గాన్ని పాలించి పది ఊర్లు తిరగలేదని, పది ఇండ్లు ఇవ్వలేదు, పది బోర్లు వెయ్యలేదు, పది మందిని ఆదుకోలేనీ ఎంపి నేడు ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కారు స్పీడ్ లో ఉన్నప్పుడు కార్ ఎక్కి కారు బోల్తా కొట్టింది అని , కారు దిగి మళ్ళీ పువ్వు మీద కూసున్నవు , నువ్వు ఎక్కడ కూసున్న నీకు ఓట్లు మాత్రం రావన్నారు. ఎంపీకి సొంత వ్యాపారం మీద ఉన్న ఆసక్తి ప్రజల అభివృద్ది పట్ల లేదని విమర్శించారు. గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటా అన్నావ్, గాంధారి మండలానికి చేసిందేమిటి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి సురేష్ శెట్కార్ కు ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించి, బిజినెస్ బీబీ పాటిల్ ని ఇంటికి సాగనంపాలని నియోజక వర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు.