భవిత భవనంలో 10 మంది దివ్యాంగులకు ఫిజియోథెపీ చికిత్సలు… – ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్ ఎల్లారెడ్డి, మార్చి 28,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులకు ప్రతి రోజు వ్యాయామం చేయించడం వల్ల తప్పకుండా మార్పు వస్తుందని, ఫిజియోథెరపీ వైద్యులు జి. అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోనీ స్థానిక భవిత భవనంలో తెలంగాణ సర్వ శిక్షాభియాన్ వారి సహిత విద్యలో భాగంగా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత ఫిజియోథెరపీ శిబిరంలో దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేశారు. ఈ సందర్భంగా 10 మంది దివ్యాంగ చిన్నారులకు వారి తల్లితండ్రుల సమక్షంలో చేయించాల్సిన వ్యాయామ పద్ధతులను ఫిజియోథెరపీ వైద్యులు ప్రత్యక్షంగా చేసి చూయించారు. ఇదే మాదిరిగా దివ్యాంగ చిన్నారులకు తల్లి తండ్రులు ఇంటి వద్ద ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయించడం ద్వారా దివ్యాంగుల్లో తప్పకుండా మార్పు వస్తుందని అన్నారు. ధివ్యాంగులకు, శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చే విధంగా ఆత్మ స్థైర్యం పెంపొందించాలని తల్లి తండ్రులకు సూచించారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఈ ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులు ఉన్నటువంటి తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఫిజియోథరపీ శిబిరంలో ఐఈఆర్పి లు వెంకటేష్, సిజివి పద్మ తో పాటు దివ్యాంగ చిన్నారుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి
37
previous post