3 కేంద్రాల్లో కలిసి 703 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరు….
– ఎల్లారెడ్డి ఎంఈఓ ఏవి. వెంకటేశం
ఎల్లారెడ్డి, మార్చి 23,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని 3 పరీక్ష కేంద్రాల్లో, శనివారం నాడు నాల్గవ రోజు పదవ తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగాయని స్థానిక ఎంఈఓ ఎవి. వెంకటేశం తెలిపారు. పట్టణంలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులకు గాను అందరూ హాజరయ్యారని సిఎస్, డిఓ లు విఘ్నేశ్వర్ రెడ్డి, జబీన తెలిపారు. ఆదర్శ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు అందరూ హాజరయ్యారని సిఎస్, డిఓ లు పి. సాయిబాబా, బి.వెంకట రాజు లు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 223 మంది విద్యార్థులకు గాను అందరు విద్యార్థులు పరీక్ష హాజరయ్యారని సిఎస్, డిఓ లు క్రాంతి కృతామూర్తి, వెంకట రామిరెడ్డి తెలిపారు. మూడు కేంద్రాల్లో కలిపి 703 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాసారని, సిఎస్, డిఓ లు తెలిపారు. పరీక్షలు కట్టు దిట్టంగా ఎలాంటి మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా, ప్రతి విద్యార్థిని ముందుగానే సిబ్బందిచే స్క్రీనింగ్ చేసి, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్ లను సైతం అనుమ తించకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష గదుల్లోకి పంపించడం జరిగిందని ఎంఈఓ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని అన్ని జీరాక్స్ సెంటర్లు పరీక్ష ముగిసే వరకు మూసి ఉంచారు. ఆరోగ్య సిబ్బంది కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్సలకు అవసరమైన మందులతో పరీక్ష ముగిసేంత వరకు అందుబాటులో ఉన్నారు.