బిచ్కుంద మార్చ్ 9:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బస్వలింగప్ప మఠ్ సంస్థాన్ లో నిజామాబాద్ అంకం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీశ్రీశ్రీ సోమలింగ శివాచార్య మహారాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ కావున భక్తులందరూ ఈ యొక్క ఉచిం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత మగా వైద్య శిబిరం నిర్వహించిన అంకం హాస్పిటల్ యాజమాన్యానికి ఆ పరమశివుడు ఎల్లవేళలా తోడుంటాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకం హాస్పిటల్ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.