కామారెడ్డి, ఫిబ్రవరి 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, మోసపూరిత మాటల ద్వారా మరికొందరు వ్యాపారులు అమాయక ప్రజలను చూసి ఆర్థిక సహాయం చేస్తామని తెలుపుతూ వారి వద్ద నుండి ఇల్లు, ప్లాటు వ్యవసాయ భూముల దస్తావేజులను తీసుకొని అప్పులు ఇస్తున్నారని, తిరిగి డబ్బులు చెల్లించాలని అధిక వడ్డీ రేట్ల లెక్కలు చూపుతూ చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ వారి ఆస్తుల దస్తావేజులను జప్తు చేసుకోవడం జరుగుచున్నదని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఇలా వ్యాపారం చేస్తున్నారన్న అనుమానం,సమాచారం ఉన్న పక్క సమాచారం మేరకు వ్యాపారులందరిపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏక కాలంలో దాడులు చేయడం జరిగిందని, తనిఖీలలో పట్టుబడ్డ ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 13 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. గురువారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక ఎంతోమంది బాధితులు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలాంటి ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతోనే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మోసపూరిత వ్యాపారులపై దాడులు చేయడం జరిగిందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలు పాలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు హెచ్చరించారు.
అక్రమ మార్గాల ద్వారా అధిక వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు. జిల్లా ఎస్పీ సింధు శర్మ
48
previous post