హైదరాబాద్ , ఫిబ్రవరి 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలో గల నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ విభాగం నూతన సభ్యుడిగా హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ నియమితులయ్యారు. దక్షిణ భారతదేశము నుండి ఏకైక సభ్యుడిగా ఆయన నియామకం జరిగింది. కౌన్సిల్ నూతన కార్యవర్గంలో దక్షిణ భారతదేశము నుండి ఉర్దూ కమ్యూనిటీకి చెందిన అబ్దుల్ సత్తార్ ను సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దక్కన్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కు ఆయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు, దేశ్ కా సహారా ఉర్దూ పత్రిక సంపాదకులుగా ఆయన పనిచేస్తున్నారు. తనను ఉర్దూ కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న విశ్వాసంతో ఈ జాతీయస్థాయి హోదాను ప్రసాదించడంపై, దాని విలువల్ని కాపాడుతూ, జాతీయస్థాయిలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ నూతన సభ్యుడిగా ఎంఏ సత్తార్….. దక్షిణ భారతదేశం నుండి ఏ కైక సభ్యుడి నియామకం
69
previous post