Home తాజా వార్తలు ఈటలనూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే తాట తీస్తాం.                             తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం

ఈటలనూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే తాట తీస్తాం.                             తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం

by V.Rajendernath

కామారెడ్డి, ఫిబ్రవరి 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

ఈటలనూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే తాట తీస్తాం అని తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం హెచ్చరించారు. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఈటల రాజేందర్ ఓ గృహప్రవేశానికి వెళ్లిన సందర్భంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాజకీయంగా బద్నాం చేయడం సిగ్గుచేటన్నారు.  తెలంగాణ లో ఒక స్థాయి కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఒక బీసీ బిడ్డను ఇలా రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని,  విచ్చలవిడిగా సోషల్ మీడియాలో గృహప్రవేశంలో వివిధ పార్టీల  రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు పెట్టి మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న,  చిల్లర వేషాగళ్ళ సంగతి చట్టపరంగా చర్యలు చేపట్టేలా చూస్తాం అన్నారు. తప్పుడు పోస్టులు పెట్టె చిల్లర రాజకీయ నాయకులరా  ఖబర్దార్  అంటూ ఆగ్రహించారు.  ఈటల రాజేందర్ అన్ని వర్గాలకు  అన్ని పార్టీ నాయకులకు సుపరిచితమే అన్నారు.  అందరితో కలుపు కొని పోయే నాయకుడని,  అలాంటి నాయకుని పై విచ్చలవిడిగా తెలివితక్కువ ఆకలి ఎక్కువ అనే విధంగా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం ఒక బీసీ బిడ్డను కించపర్చిడమే అన్నారు.  రాజకీయంగా దెబ్బతీయాలనే విధంగా పోస్టులు చేస్తున్నారని,  ఖబర్దార్ ఇటల రాజేందర్ ఒక శక్తి ఒక మహన్నతమైన వ్యక్తి అన్న విషయం మార్చి తప్పుడు పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న వారికి సరైన సమయంలో ప్రాజెస్లు గుణపాఠం చెబుతారన్నారు.   తెలంగాణ బిడ్డలు ఆయన్ను ఆదర్శంగా  తీసుకొని లక్షల మంది ఆయన వెంట నడుస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గం ఆయన వెంట ఉన్నారనేది మర్చిపోతున్నట్టున్నారన్నారు.  ఓర్వలేని చిల్లర చితక నాయకులు చిల్లర పోస్టులు పెట్టిస్తున్నారు పనికిమాలిన నాయకులారా ఖబర్దార్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే వీపులు మోగుతాయి అనేది కూడా మర్చిపోవద్దు అని శనివారం ఆయన పత్రికాముఖంగా తప్పుడు పోస్టులను తీవ్రంగా ఖండించారు.

You may also like

Leave a Comment