రాజాపూర్, ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ ప్రెస్ : వరి పంటలను కాపాడుకోవడంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకొని పంటలను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ తెలిపారు.రాజాపూర్ మండలంలోని దొండ్లపలి గ్రామంలో బుధవారం మండల వ్యవసాయాధికారి నరేందర్ తో కలిసి వరి పంటలను పరిశీలించారు.యాసంగి వరిలో ఉధృతమవుతున్న కాండం తొలిచే పురుగు – యాజమాన్యం గురించి వివరించారు.
వరి పైర్లు కొన్ని చోట్ల నారుమడి దశలోనూ,మరికొన్ని ప్రాంతాల్లో పిలకదశలోనూ ఉన్నాయని అన్నారు.గత
సంవత్సరం యాసంగిలో కాండం తొలిచే పురుగు ఉధృతి వల్ల రైతులు అధికంగా నష్టపోవటం జరిగిందని,ఈ యాసంగిలో కూడా నారుమడి, పిలక దశల్లో కాండం తొలిచే పురుగు రెక్కల పురుగుల ఉధృతి అధికంగా గమనించడం జరిగిందని తెలిపారు.
పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎరను, సోలార్ దీపపు ఎర లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలని అన్నారు.
పిలకదశలో ఎకరాకు 3 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25 నుంచి80 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా
సస్యరక్షణ చేపట్టాలన్నారు.
ఈ యాసంగిలో నారుమడి దశలో అశించే నష్టపరుస్తుందాని,నారు మడిలో కార్బోఫ్యూరాన్ ౩జి గుళికలు లేదా 600 గ్రాముల ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలని అన్నారు.ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న పిలకదశలో ఉన్న వరిపైరులో ఈ యాసంగిలో తప్పకుండా
ఎకరాకు కార్బోఫ్యూరాన్ ౩జి గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్
0.4జి గుళికలు 4 కిలోలు 20నుంచి25 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో వేయాలని
అలాగే మోగిపురుగు నివారణకు సిఫారసు చేయబడని ఇతర 10జి లేదా సేంద్రీయ గుళికలను యూరియాతో కలిపి వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇట్టి విషయాన్ని రైతు గమనించాలని అన్నారు.
గత రెండు సంవత్సరాల నుండి పురుగు ఉధృతి అధికంగా ఆశించి పంటలను నష్టపరుస్తుందని,వరిపంట చిరుపొట్ట దశలో రెక్కల పురగుల ఉధృతి గమనించాలని అన్నారు. ఏఈఓ మేఘనాథ్ రైతులు కృష్ణయ్య, చిన్నయ్య పాల్గొన్నారు.
పంటలను కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి
55
previous post