Home తాజా వార్తలు ఈఎస్ఎంఎస్ యాప్ పై అధికారులకు అవగాహన

ఈఎస్ఎంఎస్ యాప్ పై అధికారులకు అవగాహన

by V.Rajendernath

కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన.

కామారెడ్డి, జనవరి 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

ఈఎస్ఎంఎస్(ఎలక్షన్ సీజర్ మేనేజ్ మెంట్ సిస్టం, election seizure management system)యాప్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లు, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారి సంతోష్ ప్రతారియా….. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈఎస్ఎంఎస్ యాప్ డౌన్లోడ్, లాగిన్ అయ్యే విధానం పై వివరించారు.  ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే సామగ్రిని పట్టుకొనిఆ వివరాలు ఈఎస్ఎంఎస్ యాప్ లో అప్లోడ్ చేసే విధానం, వాహనాలను తనిఖీ చేసే పద్ధతిపై జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్, సర్విలెన్స్ స్టాటిస్టికల్ టీమ్( ఎఫ్ఎస్/ ఎస్ఎస్ టీ) అధికారులకు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్, సర్విలెన్స్ స్టాటిస్టికల్ టీమ్( ఎఫ్ఎస్/ ఎస్ఎస్ టీ) లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాహనాల తనిఖీలో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను టీం సభ్యులు పరిశీలించి, పట్టుకోవాలని చెప్పారు. తనిఖీలలో మద్యం దొరికితే మద్యం ను ఎక్సైజ్ అధికారులకు అప్పగించాలని సూచించారు. పట్టుబడిన నగదు వివరాలను నోడల్ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. తనిఖీ బృందాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, సిపిఓ రాజారాం, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల తనిఖీ బృందాల అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment