ముధోల్ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి
ముధోల్.ఆగస్టు25(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా శుక్రవారం ముధోల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి నిర్వహించారు.ఈకార్యక్రమంకు ముధోల్ MLA విట్ఠల్ రెడ్డి పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… నాటి పాలకుల అరాచకాలను అణిచి వేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అన్నారు. మహనీయులు ఏ ఒక్క కులం కోసం కాకుండా అందరి కోసం పాటుపడ్డారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి పాలకుల అరాచకాలను అణిచివేసి అణగారిన వర్గాల పేదల కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు.అన్నివర్గాల వారు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని, ప్రజాస్వామిక స్పూర్తితో పోరాడడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతిఒక్కరూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్,ముధోల్ సర్పంచ్ రాజేందర్,MPTCలు సరళ శ్రీనివాస్ గౌడ్, భూమేష్,గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ , సత్తయ్య గౌడ్ ,మురళి గౌడ్ ,సంఘ నాయకులు అంజగౌడ్ ,సాయిబాబా గౌడ్ ,మల్ల గౌడ్, వెంకటేష్ గౌడ్ ,సీ ఐ వినోద్ రెడ్డి,ఎస్ ఐ సాయి కిరణ్,తోపాటు నాయకులు ఖాళీద్, సురేందర్ రెడ్డి,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్
35
previous post