Home తాజా వార్తలు 8 వ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం….రెండు కేంద్రాల్లో కలిపి 10 మంది గైర్హాజరు

8 వ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం….రెండు కేంద్రాల్లో కలిపి 10 మంది గైర్హాజరు

by Telangana Express
  • పరీక్ష కేంద్రాల సీఎస్ డీఓ లు

ఎల్లారెడ్డి, మార్చి 7, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల “ఎ” , ఆదర్శ కళాశాల “బి” పరీక్ష కేంద్రాల్లో, గురువారం నాడు 8 వ రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సర పార్ట్ 3, మాథ్స్ 2 బి, జువాలోజి 2, హిస్టరీ 2, (వొకేషనల్) ( సెట్ “సి” ) పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హేమచందర్, పి.సాయిబాబా, స్వప్న, పద్మ లు తెలిపారు. “ఏ” కేంద్రంలో 172 మందికి 168 మంది హాజరు కాగా 04 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 31 మందికి గాను అందరూ హాజరయ్యారు. “బి” కేంద్రంలో 187 మందికి గాను 184 మంది పరీక్షకు హాజరు కాగా 03 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెండు కేంద్రాల్లో కలిపి 07 మంది విద్యార్థులు గైహాజరైనట్లు సీఎస్, డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా , ఒక్కో విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోనికి పంపించి, పక డ్బందీగా పరీక్ష నిర్వహించడం జరిగిందని సిఎస్, డి ఓ లు తెలిపారు. ఎండలు ముదురుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారని సి ఎస్, డీ ఓ లు తెలిపారు.

You may also like

Leave a Comment